Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్ మంతనాలు : ఆనం సోదరులకు టీడీపీ బెర్త్ ఖాయం?

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (12:54 IST)
ఆనం సోదరులకు టీడీపీ బెర్త్ ఖాయమనిపిస్తోంది. మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, ఆయన సోదరుడు ఆనం వివేకానందరెడ్డిలతో ఏపీ సీఎం చంద్రబాబు తనుయుడు మంతనాలు జరిపారు. తద్వారా ఆనం సోదరులు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనిపిస్తోంది. 
 
నాలుగు రోజుల క్రితం ఆనం సోదరులు టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కూడా అయ్యారు. అనంతరం వీరిద్దరి బాధ్యతనూ యువనేత లోకేశ్‌కు అప్పజెప్పారు చంద్రబాబు. ఈ క్రమంలో ఆనం సోదరులతో లోకేశ్ ఫోనులో సంభాషించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నెల 24న చంద్రబాబు నెల్లూరులో పర్యటించనున్నారు. ఈ లోగానే ఆనం సోదరుల వ్యవహారాన్ని తేల్చే పనిలో లోకేశ్ ఉన్నట్టు తెలుస్తోంది.
 
అయితే, ఆనం సోదరులు టీడీపీలో చేరితే జిల్లా పార్టీలో వారి ఆధిపత్యం పెరిగిపోతుందని అదే జిల్లాకు చెందిన మరో నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. ఈ కారణంగానే వీరిద్దరికి చాలా రోజుల పాటు చంద్రబాబు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. అయితే, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి సూచనతో చంద్రబాబు మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments