Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్ మధ్యవర్తిత్వం : టీడీపీలోకి ఆనం బ్రదర్స్ ఎంట్రీ ఖాయం!

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (16:56 IST)
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బలమైన రాజకీయ నేతలుగా చెలామణి అవుతున్న కాంగ్రెస్ సీనియర్ నేతలైన ఆనం బ్రదర్స్ (ఆనం వివేకానంద రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి)లు సొంత పార్టీకి గుడ్‌బై చెప్పి.. టీడీపీలో చేరడం దాదాపుగా ఖాయమైందని చెప్పొచ్చు. టీడీపీ యువనేత నారా లోకేష్ మధ్యవర్తిత్వం ఫలించడంతో వారు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేందుకు ముందుకు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
గత ఎన్నికల్లో వీరిద్దరు చిత్తుగా ఓడిపోయిన వీరు ఇపుడు తమ నివాసాలకే పరిమితమయ్యారు. కాంగ్రెస్ పార్టీ చేసిన విభజన పాపం వల్లే తాము ఓడిపోయామని వారు పలు మార్లు బహిరంగంగానే చెప్పారు. అదేసమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వారు ప్రశంసల వర్షం కురిపిస్తూ వచ్చారు. దీనికితోడు బీజేపీ సీనియర్ నేత వెంకయ్య జోక్యం చేసుకుని టీడీపీలో చేర్చుకోవాల్సిందిగా చంద్రబాబును కోరారు. 
 
దీంతో తన తనయుడు నారా లోకే‌ష్‌ను చంద్రబాబు రంగంలోకి దించారు. ఫలితంగా ఆనం బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరడం ఖాయమని తేలిపోయింది. అయితే ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆనం సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరడం అక్కడ స్థానికంగా వుండే తెలుగుదేశం నాయకత్వానికి కొంత ఇబ్బంది కలిగించే అంశం కావచ్చు. కొంత వ్యతిరేకత కూడా ఎదురయ్యే అవకాశం వుంది. అందుకే, ఆనం సోదరుల తెలుగుదేశంలో చేరిక సాఫీగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగే బాధ్యతను నారా లోకేష్ తీసుకున్నట్టు తెలుస్తోంది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments