అబ్బా ఎండలు.. కరోనాతో తిప్పలు.. ఇక వర్షాలు వచ్చేస్తున్నాయ్!

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (22:07 IST)
అసలే ఎండలు భగ్గుమంటున్నాయి. కరోనా ఓవైపు ఎండలు మరోవైపు తెలుగు రాష్ట్ర ప్రజలను ముప్పు తిప్పలు పెడుతుంటే.. అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు.

అదేంటంటే..? దక్షిణ అండమాన్‌ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి స్థిరంగా కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం వెల్లడించారు.

ఇది ఆగేయ దిశగా మయన్మార్‌ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందని, రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. 
 
దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 48 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు.

దక్షిణ కోస్తాంధ్రాలోని పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments