Webdunia - Bharat's app for daily news and videos

Install App

మున్నంగి సీ ఫుడ్స్‌ కంపెనీలో అమ్మోనియం వాయువు లీక్.. 16 మందికి అస్వస్థత

Webdunia
బుధవారం, 5 జులై 2023 (13:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో విషవాయువు లీకైంది. మున్నంగి సీ ఫుడ్స్‌ కంపెనీలో అమ్మోనియం వాయువు లీకైంది. చేపలను ప్రాసెసింగ్ చేసే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో 16 మంది కూలీలు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వారిని ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
బుధవారం ఉదయం చేపలను ప్రాసెసింగ్ చేస్తున్న సమయంలో విష వాయువు లీక్ కావడంతో అక్కడ పనిచేస్తున్న వారు ఆ విష వాయువును పీల్చారు. దీంతో వారంతా అస్వస్థతకు లోనయ్యారు. వారంతా అపస్మారకస్థితిలోకి వెళ్లారని, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించామని ఫ్యాక్టరీ ప్రతినిధి తెలిపారు. 
 
కార్మికలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఒంగోలు రిమ్స్‌లో చేర్పించినట్టు తెలిపారు. బాధిత కార్మికులంతా ఒరిస్సాకు చెందిన దినకూలీలు కావడం గమనార్హం. అయితే, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. కార్మికుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే వివరాలు కూడా తెలియరాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments