Webdunia - Bharat's app for daily news and videos

Install App

మున్నంగి సీ ఫుడ్స్‌ కంపెనీలో అమ్మోనియం వాయువు లీక్.. 16 మందికి అస్వస్థత

Webdunia
బుధవారం, 5 జులై 2023 (13:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో విషవాయువు లీకైంది. మున్నంగి సీ ఫుడ్స్‌ కంపెనీలో అమ్మోనియం వాయువు లీకైంది. చేపలను ప్రాసెసింగ్ చేసే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో 16 మంది కూలీలు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వారిని ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
బుధవారం ఉదయం చేపలను ప్రాసెసింగ్ చేస్తున్న సమయంలో విష వాయువు లీక్ కావడంతో అక్కడ పనిచేస్తున్న వారు ఆ విష వాయువును పీల్చారు. దీంతో వారంతా అస్వస్థతకు లోనయ్యారు. వారంతా అపస్మారకస్థితిలోకి వెళ్లారని, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించామని ఫ్యాక్టరీ ప్రతినిధి తెలిపారు. 
 
కార్మికలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఒంగోలు రిమ్స్‌లో చేర్పించినట్టు తెలిపారు. బాధిత కార్మికులంతా ఒరిస్సాకు చెందిన దినకూలీలు కావడం గమనార్హం. అయితే, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. కార్మికుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే వివరాలు కూడా తెలియరాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments