Webdunia - Bharat's app for daily news and videos

Install App

రతిలో సహకరించలేదనీ చావమన్న డాక్టర్ భర్త.. చనిపోయిన భార్య.. ఎక్కడ?

ఇటీవల అమరావతి వద్ద ఓ నవవధువు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం తెలిసింది. మూడు నెలల క్రితం వివామైన ఈ నవవధువు.. పడక గదిలో సరిగా సహకరించడం లేదన్న కోపంతో భర్త చావమన్నాడు.

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2017 (09:23 IST)
ఇటీవల అమరావతి వద్ద ఓ నవవధువు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం తెలిసింది. మూడు నెలల క్రితం వివామైన ఈ నవవధువు.. పడక గదిలో సరిగా సహకరించడం లేదన్న కోపంతో భర్త చావమన్నాడు. అంతే... ఇకేమాత్రం ఆలోచన చేయకుండా ఆ నవవధువు బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయం ఆమె చనిపోయే ముందు తన తల్లిదండ్రులకు పంపిన ఎస్ఎస్ఎంలో వెల్లడైంది. అలాగే, భర్త వేధింపుల వల్ల తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆమె ఓ కాగితంపై రాసిపెట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం తాళ్లచెరువుకు చెందిన అమరనాథ్‌ అనే వ్యక్తి దంత వైద్యశాల నడుపుతున్నాడు. మే నెలలో హైదరాబాద్‌కు చెందిన సుజల(27)తో అతనికి వివాహమైంది. వేరుకాపురం పెట్టేందుకు అమరావతిలోని విజయవాడ రోడ్డు సమీపంలో నెలరోజుల క్రితం ఇల్లు అద్దెకు తీసుకున్నారు. 
 
ఆషాఢం రావడంతో సుజల పుట్టింటికి వెళ్లి మూడు రోజుల క్రితం అమరావతి చేరుకుంది. శనివారం ఉదయం యథావిధిగా పనులు చేసుకుని మధ్యాహ్నం దంపతులిద్దరూ కలసి భోజనం చేశారు. ఆ తర్వాత సాయంత్రం వైద్యశాలకు వెళ్లిన అమరనాథ్‌ తిరిగి ఇంటికి వచ్చేసరికి వంట గదిలో భార్య చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
అయితే, సుజల ఆత్మహత్య చేసుకునేముందు తన తల్లిదండ్రులకు పెట్టిన సెల్‌ఫోన్‌ మెసేజ్‌ ఓ పెట్టింది. అలాగే, తాను ఆత్మహత్య చేసుకుంటున్నాననీ, అందుకు తన భర్త అమరనాథ్‌ కారణమనీ కాగితంపై రాసి బైబిల్‌లో ఉంచినట్లు మెసేజ్‌ పెట్టింది. దాని ఆధారంగా సీఐ మురళీకృష్ణ విచారణ చేపట్టగా భర్త వేధించడం, చావమని ప్రోత్సహించడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు నిర్ధారించారు. 
 
సుజల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి భర్త అమరనాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని సోమవారం కోర్టులో హాజరు పర్చనున్నట్లు సీఐ తెలిపారు. సుజల మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments