Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా తీర్థం పుచ్చుకోనున్న అంబటి రాయుడు? సీఎం జగన్‌తో భేటీ!

Webdunia
గురువారం, 8 జూన్ 2023 (19:45 IST)
అన్ని క్రికెట్ ఫార్మెట్లకు గుడ్‌బై చెప్పిన భారత క్రికెట్ జట్టు క్రికెటర్ అంబటి రాయుడు ఏపీలోని అధికార వైకాపాలో చేరనున్నారు. ఇదే అంశంపై ఆయన గురువారం తాడేపల్లిలోని సీఎం జగన్‌ను కలుసుకున్నారు. రాయుడుతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్.శ్రీనివాసన్ కుమార్తె రూపా గురునాథ్, ఇతర సీఎస్కీ పెద్దలు కూడా పాల్గొన్నారు. 
 
ఐపీఎల్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకున్న ట్రోఫీని వారు సీఎం జగన్‌కు చూపించారు. ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై జట్టును ఈ సందర్భంగా సీఎం జగన్ అభినందించారు. ఈ క్రమంలో చెన్నై ఆటగాళ్ళ సంతకాలతో కూడిన జెర్సీని రుపా గురునాథ్, అంబటి రాయుడులు సీఎం జగన్‌కు అందజేశారు. 
 
ఈ సందర్భంగా అంబటి రాయుడు మాట్లాడుతూ, ఏపీలో క్రీడారంగం అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా క్రీడలను ప్రోత్సహించేందుకు తాను ఆసక్తిగా ఉన్నట్టు సీఎం జగన్‌కు సూచించారు. క్రీడల అభివృద్ధికి తగిన సూచనలు స్వీకరిస్తామని, ఈ మేరకు పటిష్టమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments