Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసైనికులు సమర్పించు.. 'సందులో సంబరాల శ్యామ్‌బాబు' సినిమా ప్రారంభం

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2023 (10:04 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై సినిమా తీయనున్నట్టు ఏపీ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. ఇలా ప్రకటించిన 24 గంటలు తిరగకముందే జనసైనికులు అంబటి రాంబాబు జీవిత చరిత్రపై ఓ సినిమాను ప్రారంభించారు. జనసైనికులు సమర్పణలో "సందులో సంబరాల శ్యాంబాబు" అనే టైటిల్‌తో వారు ఓ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలను బుధవారం తిరుపతిలో ప్రారంభించారు. 
 
తమ అభిమాన నేత, హీరో పవన్‌ కల్యాణ్‌ నటించిన "బ్రో" సినిమాపై మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఖండిస్తూ తిరుపతి జనసేన నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. ముందుగా మంత్రి అంబటి రాంబాబు వేషధారణ కలిగిన వ్యక్తి ఆధ్వర్యంలో స్వామివారికి పూజలు నిర్వహించి క్లాప్‌ కొట్టి సినిమా ప్రారంభించారు. 
 
ఆ వ్యక్తిని గొబ్బెమ్మలా కింద కూర్చోబెట్టి వీరమహిళలు చేతులకు గాజులు వేసి నృత్యం చేస్తూ పూలు చల్లారు. కార్యక్రమంలో జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కిరణ్‌ రాయల్‌, జనసేన పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, నాయకులు సుభాషిణి, కీర్తన, అరుణ, శేషారత్నం పాల్గొన్నారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
దీనిపై కిరణ్ రాయల్ మాట్లాడుతూ, తమ చిత్రంలో నటించేందుకు వైకాపా నేతలకు కూడా అవకాశం ఇస్తామన్నారు. ఇందులో వయసు లేదా అందం లేదా అనుభవంతో పనలేదన్నారు. పనీబాటలేకుండా అడ్డ తిరుగుళ్లు తిరుగుతా బాధ్యతారాహిత్యంగా ఉంటే చాలన్నారు. మంత్రి అంబటి రాంబాబు కూడా తమను సంప్రదిస్తే అవకాశం ఇస్తామంటూ ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments