Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌ను కలిసిన సిట్‌ అధికారులు

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (16:47 IST)
విశాఖ భూఅక్రమాలపై ఏర్పాటైన సిట్‌ మధ్యంతర నివేదికను అధికారులు సీఎం వైఎస్‌.జగన్‌కు సమర్పించారు. ఈ మేరకు సిట్‌ ఛైర్మన్‌ డా.విజయ్‌కుమార్‌, సభ్యులు అనురాధ, భాస్కర్‌రావు సీఎంను అమరావతిలో కలిశారు. ఈ సందర్భంగా మొత్తం 1351 ఫిర్యాదులు మాత్రమే ఉన్నట్లు గుర్తించామని అధికారులు సీఎంకు తెలిపారు. 
 
భూ అక్రమాలకు సంబంధించి తప్పులు జరిగినట్లు గుర్తించినట్లు, ఆ అంశాలను నివేదకలో పొందుపర్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అక్రమాల్లో ఐఏఎస్‌ అధికారుల నుంచి కింది స్థాయి అధికారులు వరకు ఉన్నట్లు వారు తెలిపారు. ఇంకా లోతుగా అధ్యయనం చేయాల్సిన అంశాలు ఉన్నాయని వారు సీఎంకు వివరించారు. 
 
ఈ నెల 31తో సిట్‌ గడువు ముగియనుండడంతో పొడిగించాల్సిన అవసరముందని వారు తెలిపారు. ఈ సందర్భంగా అక్రమాలపై లోతుగా అధ్యయనం చేయాలని సిట్‌ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. అంతేకాకుండా సిట్‌ గడువు పొడిగిస్తున్నట్లు సీఎం జగన్‌ వారికి హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments