Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలు గొర్రెలు ... కాకుంటే 151 సీట్లు ఎలా ఇస్తారు : జేసీ దివాకర్ రెడ్డి

Webdunia
బుధవారం, 15 జనవరి 2020 (12:24 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజలను గొర్రెలుగా భావిస్తున్నారనీ, నిజంగా ప్రజలు గొర్రెలు కాకపోతే వైకాపాకు 151 సీట్లు ఎలా ఇస్తారంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. 
 
రాజధాని తరలింపును నిరసిస్తూ గత కొన్ని రోజులుగా అమరావతి రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. బుధవారం మందడంలో జరుగుతున్న రైతుల దీక్షకు జేసీ దివాకర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి స్పందిస్తూ, ఏపీ రాజధానిగా ఉంటే అమరావతి ఉండాలని లేనిపక్షంలో తమను తమిళనాడు లేదా కర్నాటకలో కలపాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
అంతేకాకుండా, వైఎస్ జగన్‌పై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో యేడాదిలోపు జగన్ సతీమణి భారతి సీఎం కాబోతోందని జోస్యం చెప్పారు. ఒకరి మూర్ఖత్వం వల్ల మనకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. 
 
విశాఖలో రాజధాని పెట్టాలంటే జగన్‌ నిర్ణయం తీసుకుంటే సరిపోదని.. అందరి అభిప్రాయాలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. పైగా, ప్రజలను జగన్ గొర్రెలుగా భావిస్తున్నారన్నారు. నిజంగానే గొర్రెలు కాకపోతే జగన్ పార్టీకి 151 సీట్లు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments