Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశాన్ని నిలబెట్టేది పసుపు - కుంకుమ పథకమే : జేసీ దివాకర్ రెడ్డి

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (11:45 IST)
వచ్చే నెల 23వ తేదీన వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే అది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ పథకం వల్లే అవుతుందని ఆ పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తాము గెలువబోతున్నామన్నారు. ఆ గెలుపు కేవలం పసుపు కుంకుమ, వృద్ధాప్య పింఛన్ల వల్లేనని ఆయన చెప్పారు. 
 
సీఎం హోదాలో చంద్రబాబు గత ఐదేళ్ళ కాలంలో 120 పథకాలు ప్రవేశపెట్టారన్నారు. 'రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నదుల అనుసంధానం చేశారు. రైతు బాగుపడాలని చాలా శ్రమించారు. అప్పు, సప్పూ చేసి.. కాళ్లు పట్టుకున్నారు.. జుత్తు పట్టుకున్నారు. ఇంతలా రైతుల కోసం ఆయన శ్రమిస్తే ఒక్కడైనా ఆయనను అభినందించాడా? ఎందుకు చెయ్యాలి? ఏం అవసరముంది.. ఈ సంక్షేమ కార్యక్రమాల్లో? కూడు, బట్ట పెట్టాయా? నేను నిజం చెబుతున్నా.. మా తెలుగుదేశాన్ని నిలబెట్టేది.. కేవలం పసుపు - కుంకుమ, ముసలోళ్లకిచ్చే పింఛన్లు. ఈ రెండు లేకపోతే మా పరిస్థితి ఆ భగవంతుడికే తెలియాలి' అని జేసీ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments