Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశాన్ని నిలబెట్టేది పసుపు - కుంకుమ పథకమే : జేసీ దివాకర్ రెడ్డి

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (11:45 IST)
వచ్చే నెల 23వ తేదీన వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే అది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ పథకం వల్లే అవుతుందని ఆ పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తాము గెలువబోతున్నామన్నారు. ఆ గెలుపు కేవలం పసుపు కుంకుమ, వృద్ధాప్య పింఛన్ల వల్లేనని ఆయన చెప్పారు. 
 
సీఎం హోదాలో చంద్రబాబు గత ఐదేళ్ళ కాలంలో 120 పథకాలు ప్రవేశపెట్టారన్నారు. 'రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నదుల అనుసంధానం చేశారు. రైతు బాగుపడాలని చాలా శ్రమించారు. అప్పు, సప్పూ చేసి.. కాళ్లు పట్టుకున్నారు.. జుత్తు పట్టుకున్నారు. ఇంతలా రైతుల కోసం ఆయన శ్రమిస్తే ఒక్కడైనా ఆయనను అభినందించాడా? ఎందుకు చెయ్యాలి? ఏం అవసరముంది.. ఈ సంక్షేమ కార్యక్రమాల్లో? కూడు, బట్ట పెట్టాయా? నేను నిజం చెబుతున్నా.. మా తెలుగుదేశాన్ని నిలబెట్టేది.. కేవలం పసుపు - కుంకుమ, ముసలోళ్లకిచ్చే పింఛన్లు. ఈ రెండు లేకపోతే మా పరిస్థితి ఆ భగవంతుడికే తెలియాలి' అని జేసీ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం
Show comments