Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ నిర్ణయాలు కుల మూలాలకే ప్రమాదం : పవన్ కళ్యాణ్

వృత్తుల ఆధారంగా ఏర్పడిన కుల వ్యవస్థలో ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల కుల మూలాలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అందువల్ల పాలకులు నిర్ణయాలు తీసుకునే ముందు

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (09:43 IST)
వృత్తుల ఆధారంగా ఏర్పడిన కుల వ్యవస్థలో ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల కుల మూలాలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అందువల్ల పాలకులు నిర్ణయాలు తీసుకునే ముందు ప్రజలకు నష్టం లేకుండా చూడాలని కోరారు. ప్రభుత్వ విధానాల వల్ల తమకు నష్టం జరుగుతోందని కృష్ణానది లంక గ్రామాలకు చెందిన రైతులు, పోలవరం మూల లంక రైతులు హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా తమపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వారు పవన్‌కు వివరించారు. 
 
పోలవరం ప్రాజెక్టు పరిధిలో స్పిల్‌వే నిర్మాణం నిమిత్తం తవ్వుతున్న మట్టి, రాళ్లను నేరుగా తాము సాగుచేసే భూముల్లో పోసి డంపింగ్‌ యార్డుగా మార్చేశారని, పరిహారం విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా అనుసరిస్తోందని, ఫలితంగా బతుకులు నాశనమయ్యాయని మూల లంక రైతులు పవన్‌తో మొరపెట్టుకున్నారు. ఆ తర్వాత రైతుల సమస్యలపై పవన్ సానుకూలంగా స్పందించారు. రైతులకు తమ పార్టీ అండ ఉంటుందన్నారు. రెండు ప్రాంతాల్లోనూ త్వరలోనే పర్యటిస్తానని చెప్పారు. 

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments