Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔరా! రాజ‌ధాని మారింది ... ‘అమరావతి’ పాఠం తొలగింపు!

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (10:07 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌, ఇక్క‌డ రాజ‌ధాని అనేది క‌ల‌గానే మిగిలిపోయింది. అమ‌రావ‌తిని రాజ‌ధానిగా నిర్మించాల‌ని మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు విశ్వప్ర‌య‌త్నం చేశారు. తాత్కాలిక రాజ‌ధానిని తేగ‌లిగారేకాని, దాన్ని శాశ్వ‌తం చేయ‌లేక‌పోయారు. త‌ర్వాత వ‌చ్చిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌రావ‌తిని కేవ‌లం శాస‌న రాజ‌ధానిగా పేర్కొని, విశాఖ‌, క‌ర్నూలు మ‌రో రెండు రాజ‌ధానుల‌ను సంక‌ల్పించారు. 
 
చంద్రబాబు హ‌యాంలో అమ‌రావ‌తి రాజ‌ధానిని పాఠ్యాంశంగా చేర్చ‌గా, ఇపుడు దానిని జ‌గ‌న్ ప్ర‌భుత్వం తొలగించింది. పదో తరగతి తెలుగు నుంచి అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించారు. కొత్తగా ముద్రించిన పుస్తకాలను పాఠశాల విద్యాశాఖ ఆయా బడులకు సరఫరా చేసింది. 2014లో 12 పాఠాలతో పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకం ముద్రించగా, సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద రెండో పాఠంగా ‘అమరావతి’ ఉండేది. పూర్వ చరిత్ర మొదలు రాజధానిగా ఎంపిక, నిర్మాణ విషయాలూ అందులో వివరించారు.

తాజాగా పాఠశాల విద్యాశాఖ దాన్ని తొలగించి, 11 పాఠాలతోనే పుస్తకాలు ముద్రించింది. విద్యార్థుల నుంచి పాత తెలుగు పుస్తకాలను తీసుకుని కొత్త వాటిని అందించాలని ఉపాధ్యాయులకు సూచించింది. కానీ.. పాత పుస్తకాల ప్రకారం బోధించిన ఉపాధ్యాయులు రెండో పాఠమైన ‘అమరావతి’ని ఇప్పటికే చెప్పేయడం కొస‌మెరుపు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments