Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు అమరావతి రైతులకు లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపు

ఠాగూర్
గురువారం, 12 డిశెంబరు 2024 (10:07 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్డీయే) పరిధిలో నివాస ప్లాట్లను కేటాయించేందుకు వీలుగా గురువారం లక్కీడిప్ నిర్వహించనున్నారు. ఈ లాటరీలో పేర్లు వచ్చే రైతులకు సీఆర్డీయే ప్లాట్లను కేటాయించనుంది. 
 
ముఖ్యంగా సీఆర్డీయే పరిధిలో భూ సమీకరణ పథకంలో భూములను అప్పగించిన రైతులకు ప్రత్యామ్నాయ రిటర్నబుల్ ప్లాట్ల కోసం గురువారం ఈ-లాటరీని నిర్వహిస్తున్నారు. విజయవాడ లెనిన్ సెంటరులోని ఏపీ సీఆర్డీయే కార్యాలయంలోని సమావేశ మందిరంలో దీనిని నిర్వహిస్తారు. 
 
అమరావతి పరిధిలో 14 గ్రామాలలో రైతులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా ప్రత్యామ్నాయ రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తారు. ఈ మేరకు ఏపీ సీఆర్డీఏ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. 
 
నవులూరు, కురగల్లు, నిడమర్రు, రాయపూడి, లింగయపాళెం, మల్కాపురం, నెక్కల్లు, శాఖమూరు, తుళ్ళూరు, వెలగపూడి, మందడం, అనంతవరం, ఐనవోలు తదితర గ్రామాలకు చెందిన రైతులు ఈ లాటరీకి హాజరుకావాలని కమిషనర్ విడుదల చేసిన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

Dhanush: కలాం గా ధనుష్ - కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టైటిల్ ఆవిష్కరణ

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments