Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు అమరావతి రైతులకు లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపు

ఠాగూర్
గురువారం, 12 డిశెంబరు 2024 (10:07 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్డీయే) పరిధిలో నివాస ప్లాట్లను కేటాయించేందుకు వీలుగా గురువారం లక్కీడిప్ నిర్వహించనున్నారు. ఈ లాటరీలో పేర్లు వచ్చే రైతులకు సీఆర్డీయే ప్లాట్లను కేటాయించనుంది. 
 
ముఖ్యంగా సీఆర్డీయే పరిధిలో భూ సమీకరణ పథకంలో భూములను అప్పగించిన రైతులకు ప్రత్యామ్నాయ రిటర్నబుల్ ప్లాట్ల కోసం గురువారం ఈ-లాటరీని నిర్వహిస్తున్నారు. విజయవాడ లెనిన్ సెంటరులోని ఏపీ సీఆర్డీయే కార్యాలయంలోని సమావేశ మందిరంలో దీనిని నిర్వహిస్తారు. 
 
అమరావతి పరిధిలో 14 గ్రామాలలో రైతులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా ప్రత్యామ్నాయ రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తారు. ఈ మేరకు ఏపీ సీఆర్డీఏ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. 
 
నవులూరు, కురగల్లు, నిడమర్రు, రాయపూడి, లింగయపాళెం, మల్కాపురం, నెక్కల్లు, శాఖమూరు, తుళ్ళూరు, వెలగపూడి, మందడం, అనంతవరం, ఐనవోలు తదితర గ్రామాలకు చెందిన రైతులు ఈ లాటరీకి హాజరుకావాలని కమిషనర్ విడుదల చేసిన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments