Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క సంతకంతో కేసులన్ని ఎత్తివేస్తాం : కార్యకర్తలకు అచ్చెన్నాయుడు పిలుపు

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (16:54 IST)
వైకాపా నేతలు అధికారమదంతో తమ పార్టీ కార్యకర్తలపై పెడుతున్న కేసులను టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సంతకంతో ఎత్తివేస్తామని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఒంగోలు వేదికగా టీడీపీ మహానాడు శుక్రవారం ప్రారంభమైంది. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మహానాడుకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. పార్టీ ఆవిర్భవించి 40 యేళ్లు కాగా, ఈ యేడాది పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ శతజయంతి కూడా కావడం ఈ మహానాడు చాలా ప్రత్యేకమైనదన్నారు. 
 
తమ పార్టీ అధినేత చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి కార్యకర్త కదం తొక్కాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ అంటే కేవలం అధికారంలో ఉన్నపుడే మాత్రమే రాజకీయం చేసే పార్టీ కాదని అధికారం లేకపోయినా ప్రజల మధ్య ఉండే పార్టీ అని చెప్పారు. 
 
వైకాపా పాలనలో భయపడిపోయిన కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని తెలిపారు. చంద్రబాబు పర్యటనలకు ఉత్తరాంధ్రకు మించి రాయలసీమలో మంచి స్పందన వచ్చిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 160 స్థానాలతో చంద్రబాబు సీఎం అవుతారని జోస్యం చెప్పారు. వైకాపా మంత్రులు చేపట్టిన బస్సు యాత్రలో అలీబాబా 40 దొంగలు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దయగల వ్యక్తి అమీర్ ఖాన్.. అందుకే ప్రేమించాను : గౌరీ స్ప్రత్

Super iconic: ఆన్ స్క్రీన్ శ్రీదేవిగా న‌టించాల‌నుంది.. తమన్నా భాటియా

Kantara 2: కాంతారా 2కి అన్నీ కలిసొస్తున్నాయ్.. వార్ 2తో పోటీ

పోటీపడుతున్న టాలీవుడ్ హీరోలు.. ఎందుకో తెలుసా?

'కోర్టు'తో కొత్త జీవితం మొదలైంది : నటుడు శివాజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments