Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయిన వాడే ప్రియుడు... మరొకతనితో రొమాన్స్... కాదన్నందుకు కోసేసింది....

పెళ్ళయిన వ్యక్తిని ప్రేమించింది. రెండేళ్ళ పాటు సహజీవనం చేసింది. మరో ఇద్దరితో పరిచయం ఏర్పరచుకుంది. తన అక్రమ సంబంధానికి మొదటి ప్రియుడు అడ్డొస్తున్నాడన్న కోపంతో దారుణంగా మర్మాంగాలను కోసి హత్య చేసింది. చి

Webdunia
బుధవారం, 18 జులై 2018 (17:31 IST)
పెళ్ళయిన వ్యక్తిని ప్రేమించింది. రెండేళ్ళ పాటు సహజీవనం చేసింది. మరో ఇద్దరితో పరిచయం ఏర్పరచుకుంది. తన అక్రమ సంబంధానికి మొదటి ప్రియుడు అడ్డొస్తున్నాడన్న కోపంతో దారుణంగా మర్మాంగాలను కోసి హత్య చేసింది. చిత్తూరు శ్రీకాళహస్తిలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 
శ్రీకాళహస్తి సమీపంలోని బుచ్చనాయుడు కండ్రిగలో నివాసముంటున్న గుర్రప్ప, లక్ష్మిలకు నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం ప్రవళ్లిక అనే యువతితో గుర్రప్పకు పరిచయమైంది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. రెండేళ్ళ పాటు శ్రీకాళహస్తి పట్టణంలోనే ఇద్దరూ కాపురం పెట్టి సహజీవనం కూడా చేశారు. 
 
ప్రవళ్లిక అనాధ. గుర్రప్పతో రెండు సంవత్సరాల పాటు అక్రమ సంబంధాన్ని కొనసాగించిన ప్రవళిక మరో ఇద్దరు యువకులతో పరిచయం ఏర్పరచుకుంది. గుర్రప్పకు విషయం తెలియడంతో మందలించాడు. దీంతో ప్రవళ్లిక నిన్న రాత్రి గుర్రప్ప తన ఇంటిలో నిద్రిస్తుండగా మర్మాంగాలను కోసేసి గొంతు నులిపి చంపేసింది. ప్రస్తుతం ప్రవళ్లిక పరారీలో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలి కోసం వెతుకుతున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments