Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డ తల్లితో అక్రమ సంబంధం.. పసివాడు అడ్డంగా ఉన్నాడని...

Webdunia
మంగళవారం, 6 ఆగస్టు 2019 (21:33 IST)
వివాహేతర సంబంధాలు ఎన్నో అనర్థాలకు దారితీస్తోంది. కొంతమంది క్షణాకావేశంలో హత్యలు చేస్తుంటే.. మరికొంతమంది గొడవలతో కుటుంబాలనే చిన్నాభిన్నం చేసేసుకుంటున్నారు. అలాంటి సంఘటనే విశాఖపట్నంజిల్లాలో జరిగింది.
 
సింహాచలం సమీపంలో రెండేళ్ళ బాలుడు కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. బిడ్డ తల్లితో శేఖర్ అనే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకోవడం.. ఆ బాలుడు తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని అతన్ని ఎలాగైనా చంపేయాలనుకుని కిడ్నాప్ చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. 
 
గత మూడునెలల నుంచి కాంతమ్మ అనే వివాహితతో శేఖర్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కాంతమ్మ తన భర్తతో తరచూ గొడవ పడుతూ ఉండడంతో పాటు ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. దీంతో ఆమెను తన స్నేహితుడి ఇంటిలో ఉంచాడు శేఖర్. అయితే రెండేళ్ల చిన్నారి అభిరాం తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని అతన్ని ఎలాగైనా వదిలించుకోవాలని పన్నాగం పన్నాడు.
 
ఆటోలో సింహాచలంకు తీసుకెళ్ళాడు శేఖర్. దర్శనం చేసుకున్న తరువాత కాంతమ్మను అక్కడే కూర్చోమని చెప్పి బిడ్డను తీసుకుని ఆటోలో వెళ్ళిపోయాడు శేఖర్. ఎంతకూ రాకపోవడంతో కాంతమ్మ అనుమానంతో పోలీసులను ఆశ్రయించింది. ప్రసార మాధ్యమాల ద్వారా ఈ విషయం కాస్త వైరల్‌గా మారడంతో శేఖర్ భయపడి చిన్నారిని ఏమీ చేయలేదు. పోలీసులు శేఖర్‌ను చాకచక్యంగా పట్టుకుని మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి బిడ్డను అప్పజెప్పి పంపించేశారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments