Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఆర్థిక అవకతవకలు : సీఎం జగన్‌కు హైకోర్టు నోటీసులు

Webdunia
గురువారం, 23 నవంబరు 2023 (14:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ అధికార వైకాపాకు చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు మొత్తం 41 మందికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత ఈ కేసు తదుపరి విచారణను డిసెంబలు 14వ తేదీకి వాయిదా వేసింది. 
 
రాష్ట్రంలో అమలవుతున్న పథకాల మాటును ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని, వీటిపై సీబీఐతో విచారణ జరిపించాలని రఘరామకృష్ణం రాజు తన పిటిషన్‌‍లో పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ప్రజా ప్రయోజనం లేకుండా వ్యక్తిగత ఉద్దేశంతో పిటిషన్ వేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల పిటిషన్‌కు విచారణ అర్హత లేదని వివరించారు. 
 
మరోవైపు, పిటిషన్ వేయగానే ప్రభుత్వం కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువైపు వాదనలు ఆలకించిన ధర్మాసనం ఏపీ సీఎం జగన్ రెడ్డితో సహా పలువురు మంత్రు, అధికారులతో కలిసి మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబరు 14వ తేదీకి వాయిదావేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments