Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడుకు చేరుకున్న ముంబై నటి జైత్వానీ కాదంబరి

ఠాగూర్
శుక్రవారం, 30 ఆగస్టు 2024 (15:16 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ముంబై నటి కాదంబరి జైత్వానీ ముంబై నుంచి హైదరాబాద్‌కు అక్కడ నుంచి ఏపీ పోలీసుల గట్టి పోలీస్ బందోబస్తు మధ్య విజయవాడ నగరానికి చేరుకున్నారు. ఆమె ఏపీ హోం మంత్రి అనిత, డీజీపీ తిరుమల రావులను కలిసి తనకు జరిగిన వేధింపులు, అన్యాయంపై పూర్తి వివరాలు సమర్పించనున్నారు. ఆమెపై నమోదు చేసిన ఫోర్జరీ కేసు విచారణాధికారిగా నియమితులైన ఏసీపీ స్రవంతి రాయ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం కూడా ఆమె వద్ద విచారణ జరుపనుంది. 
 
ఏపీలోని గత ప్రభుత్వ హయాంలో నటిపై తీవ్రమైన వేధింపులు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇందులో రాజకీయ నాయకులతో పాటు.. ఐపీఎస్ అధికారుల నుంచి ఎస్ఐ స్థాయి వరకు అధికారులు ఉన్నారు. ముఖ్యంగా, గత వైకాపా ప్రభుత్వంలో చక్రం తిప్పిన పెద్దల ప్రమోయం కూడా ఉన్నట్టు వెలుగులోకి రావడం ఈ విషయం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. 
 
తనను గత ప్రభుత్వమే బ్లాక్‌మెయిల్, వేధింపులు, కిడ్నాప్‌లు చేసిందని ఆమె మీడియా ముఖంగా ఆరోపించిన విషయం తెల్సిందే. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం విచారణకు ఆదేసించింది. ఈ కేసులో అసలు నిజాలు నిగ్గు తేల్చేందుకు సీసీఎస్ ఏసీపీ స్వరంతి రాయ్‌ను విచారణ అధికారిగా నియమించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments