Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ - వీర్రాజుపై మండిపాటు.. శివాజీకి బీజేపీ శ్రేణుల ఝులక్!

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (10:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో తెలుగు సినీ హీరో శివాజీకి బీజేపీ శ్రేణుల నుంచి అనుకోని తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర నేత సోము వీర్రాజుపై వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. శివాజీ బస చేసిన హోటల్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 
 
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ, వీర్రాజుపై శివాజీ వ్యాఖ్యలు చేసినట్లు బీజేపీ నేతలు ఆరోపించారు. ఆదివారం రాజమండ్రిలో శివాజీ బస చేసిన షెల్టాన్‌ హోటల్‌ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు సంఘటనా ప్రదేశానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. 
 
శివాజీ బీజేపీపై అనవసరమైన, అర్థరహితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, మోడీతోపాటు వీర్రాజుపై కూడా వ్యాఖ్యలు చేస్తూ బీజేపీకి చెడ్డపేరు తీసుకువస్తున్నారని వారు ఆరోపిస్తూ శివాజీ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో మీడియా సమావేశాన్ని అడ్డుకుంటామని, హోటల్‌ నుంచి బయటకు రానివ్వమని బీజేపీ కార్యకర్తలు హెచ్చరించారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments