తిరుపతిలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. మహానాడు వేదికపై బాలకృష్ణ ఆలస్యంగా వచ్చిన సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు మాత్రం ఆయన్ను చూసి ఒక్కసారిగా ఉల్లాసంగా, ఉత్సాహంగా కేకలు వేశారు. మహానాడు ప్రారంభమైన 5 నిమిషాల తర్వాత బాలకృష్ణ ఆలస్యంగా వేదికపైకి ఎక్కారు.
అయితే ఒక్కసారిగా బాలకృష్ణను చూసిన తెదేపా కార్యకర్తలు, నాయకులు సంతోషంతో అభివాదం చేశారు. బాలయ్య కూడా అదే ఉత్సాహంతో తెదేపా కార్యకర్తలకు అభివాదం చేస్తూ మహానాడు సభావేదికపై అటూ, ఇటూ తిరిగారు. చాలాసేపు బాలయ్య వేదికపై తిరుగుతూ ఉండటంతో సభలో కొత్త ఉత్సాహం వచ్చింది.
మరోవైపు.. మహానాడుకు బాలయ్య వెరైటీ గెటప్లో వచ్చారు. ఎప్పుడూ సాదాసీదాగా కనిపించే బాలయ్య మహానాడులో మాత్రం పెద్ద మీసాలు, మీసాలను తాకేలా గడ్డాంను పెట్టుకుని వచ్చారు. సభావేదికపై బాలయ్య అభివాదం చేసి కూర్చోగానీ, తెదేపా సీనియర్ నాయకులందరు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు.