Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు : ఏసీబీ కస్టడీకి ఏసీపీ!

ఠాగూర్
బుధవారం, 29 మే 2024 (12:28 IST)
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయిన ఏసీపీ ఉమామహేశ్వర రావును విచారణ నిమిత్తం అవినీతి నిరోధక శాఖ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టులో కస్టడి పిటిషన్ దాఖలు చేయగా, దానిపై విచారణ జరిపిన కోర్టు.. మూడు రోజుల పాటు కష్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో అక్రమాస్తుల వివరాలను వెలికి తీసేందుకు ఏసీపీని ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే, ఏసీబీ పది రోజుల పాటు కస్టడీ కోరగా మూడు రోజులు మాత్రమే కస్టడీకి  అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది. 
 
ఈ నెల 22వ తేదీన ఏసీపీ ఉమామహేశ్వర రావు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో రూ.3.95 కోల్ విలువైన ఆస్తులను అధికారులు గుర్తించారు. దీంతో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీపీని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఏసీపీని చంచల్‌గూడ జైలుకు తరలించారు. తాజాగా జైలు నుంచి ఏసీపీ ఉమామహేశ్వర రావును ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments