Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో జిల్లాల విభజన ప్రక్రియ వేగవంతం!

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (06:57 IST)
జిల్లాల విభజన ప్రక్రియను ఏపీప్రభుత్వం వేగవంతం చేసింది. నాలుగైదు నియోజకవర్గాల్లో జిల్లాల హద్దులు, జిల్లా కేంద్రాలకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నం కావడంతో వాటిని పరిశీలించి, సమస్యను పరిష్కరించేందుకు తాజాగా మరికొందరు ఉన్నతాధికారులను నియమించింది.

సమస్యలను పరిష్కరించి, సాధ్కమైనంత త్వరగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఏర్పాటు చేసిన నాలుగు కమిటీలకు వీరు అదనం. చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలకు సంబంధించి కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

దీనికి సంబంధించి గతంలో నియోజకవర్గాల పునర్విభజన చేసిన అధికారుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు. అప్పట్లో ఎటువంటి సమస్యలూ ఉత్పన్నం కాకపోవడంతో ఇప్పుడు వారితో సంప్రదించాలని భావిస్తున్నారు. కడపజిల్లా రాజంపేట, గుంటూరు జిల్లా బాపట్ల, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, విశాఖపట్నంలోని అరకు, విశాఖపట్నం, నెల్లూరు పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాలు ప్రస్తుతం రెండేసి జిల్లాల పరిధిలో ఉన్నాయి.

వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని వాటిని ప్రస్తుతం ఉన్న వాటిల్లో కలపాలా, లేక నూతనంగా సమీపంలో ఉండే జిల్లాల్లో కలపాలా అన్న ఆంశంపై అధికారులు చర్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనాభా వివరాల సేకరణ, సరిహద్దుల విభజన వంటి సమస్యలూ రాకుండా ఇతర సాంకేతిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని వీలైనంత త్వరగా పూర్తిస్థాయిలో జిల్లాలను ప్రకటించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది.

కృష్ణాజిల్లాలో నూజివీడు, కైకలూరు ఏలూరు జిల్లాలో కలిపినా ఆ జిల్లా పరిధిలో వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదని అంచనా వేశారు. అలాగే శృంగవరపుకోటను విశాఖలో కలిపేయొచ్చని నిర్ణయించినట్లు తెలిసింది. రాజంపేట, బాపట్లకు సంబంధించి జిల్లా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై తర్జన భర్జన పడుతున్నారు.

వీటితోపాటు నూతనంగా ఏర్పాటయ్యే జిల్లాల్లో జనాభా సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం కమిటీకి సూచించినట్లు తెలిసింది. వీటితోపాటు సాంకేతిక, న్యాయపరమైన సమస్యలూ రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఈ సమస్యలు పరిష్కరించి తుది నిర్ణయానికి రానున్నట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments