క్లర్క్ ఉద్యోగంలో చేరి రూ.కోట్లకు పడగలెత్తిన బీసీ సంక్షేమ అధికారి

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (13:33 IST)
తిరుపతి జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆర్.యుగంధర్ కోట్లాది రూపాయలకు పడగలెత్తారు. ఆయన చిన్నపాటి క్లర్క్ ఉద్యోగంలో చేరి ఇపుడు జిల్లా సీబీ సంక్షేమ విభాగం డిప్యూటీ డైరెక్టరుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన మరో అవినీతి తిమింగిలంగా మారారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు సంబంధించి పక్కా ఆధారాలును సేకరించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇల్లు, కార్యాలయంలో తనిఖీలు చేశారు. 
 
ఏసీబీ తిరుపతి డీఎస్పీ జనార్థన్ నాయుడు, అనంతపురం ఇన్‌చార్జి డీఎస్పీ జె.శివనారాయణ స్వామిలు ఆధ్వర్యంలో ఏసీబీ అధికారుల బృందం బుధవారం తిరుచానూరు సమీపంలోని యుగంధర్ నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఇందులో యుగంధర్ పేరుమీద ఉన్న రూ.2.72 కోట్ల ఆస్తుల్లో రూ.1.84 కోట్ల ఆస్తులు అక్రమంగా సంపాదించినవిగా గుర్తించారు. 
 
అలాగే, 850 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.5 కేజీల వెండి వస్తువులతో పాటు కొంత నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఏసీబీ అధికారులు స్పందిస్తూ, గత 1999లో క్లర్కుగా ఉద్యోగంలో చేరిన యుగంధర్ పలు పదోన్నతులు పొంది ఇపుడు డిప్యూటీ డైరెక్టరుగా పని చేస్తున్నారని తెలిపింది. ఈ కాలంలో ఆయన భారీ స్థాయిలో అవినీతికి పాల్పడి, భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు పక్కా సమాచారం అందడంతోనే ఈ సోదాలు చేసినట్టు ఆయన తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments