Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లర్క్ ఉద్యోగంలో చేరి రూ.కోట్లకు పడగలెత్తిన బీసీ సంక్షేమ అధికారి

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (13:33 IST)
తిరుపతి జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆర్.యుగంధర్ కోట్లాది రూపాయలకు పడగలెత్తారు. ఆయన చిన్నపాటి క్లర్క్ ఉద్యోగంలో చేరి ఇపుడు జిల్లా సీబీ సంక్షేమ విభాగం డిప్యూటీ డైరెక్టరుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన మరో అవినీతి తిమింగిలంగా మారారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు సంబంధించి పక్కా ఆధారాలును సేకరించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇల్లు, కార్యాలయంలో తనిఖీలు చేశారు. 
 
ఏసీబీ తిరుపతి డీఎస్పీ జనార్థన్ నాయుడు, అనంతపురం ఇన్‌చార్జి డీఎస్పీ జె.శివనారాయణ స్వామిలు ఆధ్వర్యంలో ఏసీబీ అధికారుల బృందం బుధవారం తిరుచానూరు సమీపంలోని యుగంధర్ నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఇందులో యుగంధర్ పేరుమీద ఉన్న రూ.2.72 కోట్ల ఆస్తుల్లో రూ.1.84 కోట్ల ఆస్తులు అక్రమంగా సంపాదించినవిగా గుర్తించారు. 
 
అలాగే, 850 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.5 కేజీల వెండి వస్తువులతో పాటు కొంత నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఏసీబీ అధికారులు స్పందిస్తూ, గత 1999లో క్లర్కుగా ఉద్యోగంలో చేరిన యుగంధర్ పలు పదోన్నతులు పొంది ఇపుడు డిప్యూటీ డైరెక్టరుగా పని చేస్తున్నారని తెలిపింది. ఈ కాలంలో ఆయన భారీ స్థాయిలో అవినీతికి పాల్పడి, భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు పక్కా సమాచారం అందడంతోనే ఈ సోదాలు చేసినట్టు ఆయన తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments