మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు.. తదుపరి టార్గెట్ ఆమేనా?

ఠాగూర్
ఆదివారం, 23 మార్చి 2025 (09:58 IST)
స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరిచి రూ.2.20 కోట్ల నగదును వసూలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వైకాపా మాజీమంత్రి విడదల రజనీపై ఏపీ ఏసీబీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసులో ఆమె అరెస్టు నుంచి తప్పించుకునేందుకు హైకోర్టును ఆశ్రయించారు. గత 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారన్న అభియోగాలను ఆమె ఎదుర్కొంటున్నారు. ఈ యాజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని ఆమెపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో విడదల రజనీపై కేసు నమోదు చేశారు. 
 
ఆమెను ఈ కేసులో ఏ1గా చేర్చిన ఏసీబీ అధికారులు.. ఏ2గా ఐపీఎస్ అధికారి జాషువా, ఏ3గా గోపి, ఏ4గా రజనీ పీఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చిది. ఈ కేసులో మాజీ మంత్రి వాటా రూ.2 కోట్లు ఇచ్చినట్టు కేసు నమోదు చేయగా, విడదల రజనీ మరిది గోపి, జాషువాలకు చెరో రూ.10 లక్షలు ఇచ్చినట్టు యాజమాన్యం ఫిర్యాదు చేసింది. 
 
ఈ క్రమంలో నిందితులపై అవినీతి నిరోధక చట్టంలో ఉన్న 7, 7ఏ, ఐపీసీలో ఉన్న 384, 120బి సెక్షన్ల కింద్ కేసు నమోదు చేశారు. లంచం తీసుకోవడం, అనుచిత లబ్ది చేకూర్చడంపై ఏసీబీ అధికారులు శనివారం కేసు నమోదు చేశారు. కాగా, ఈ కేసులో అరెస్టు కాకుండా ఇప్పటికే ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments