Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళయిన వివాహితకు లవ్ ప్రపోజ్ చేసిన యువకుడు.. ఆ తరువాత?

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (15:34 IST)
వివాహమైన రెండు నెలలకే ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగింది. ఒక యువకుడు ప్రేమ పేరుతో వివాహితను వేధించడంతో ఆమె మనస్థాపంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. మదనపల్లె గ్రామీణ మండలం కొత్తపల్లె పంచాయతీకి చెందిన రమ్య అనే యువతికి రెండునెలల క్రితం సమీప బంధువుతో వివాహమైంది. 
 
వివాహమైన తరువాత రెండు నెలల వరకు వీరి జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా బాగానే సాగింది. అయితే ఆ వివాహిత ఉన్న ఇంటి పక్కనే మంజునాథ్ అనే యువకుడు ఉండేవాడు. అతను వివాహిత సెల్ నెంబర్‌ను తీసుకుని ఫోన్‌లో లవ్ ప్రపోజ్ చేశాడు. పక్కింటి కుర్రాడే కదా తెలుసుకుంటాడులే అని ఊరుకుంది వివాహిత.
 
అయితే ఇంటి దగ్గరకు వచ్చి లవ్ ప్రపోజ్ చేయడం.. నువ్వు లేకుంటే చచ్చిపోతానంటూ బెదిరించడం.. ఇలా చేయడంతో విషయం కాస్త వివాహిత భర్త, అత్తమామల దృష్టికి వెళ్ళింది. ఇందులో రమ్య తప్పుందని భావించిన అత్తమామలు ఆమెను గత మూడురోజుల నుంచి హింసించడం మొదలుపెట్టారు. దీంతో మానసిక క్షోభకు గురైన వివాహిత తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు గల కారణాలను లేఖలో రాసింది రమ్య. దీంతో పోలీసులు యువకుడితో పాటు వివాహిత అత్త, మామలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments