Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ ఫోన్ చూస్తుండగా పక్కనే పడిన పిడుగు, చనిపోయిన యువకుడు

ఐవీఆర్
గురువారం, 27 జూన్ 2024 (14:54 IST)
మెరుపులు మెరుస్తూ వర్షం పడుతున్నప్పుడు జాగ్రత్తగా వుండాలని వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తూనే వుంటుంది. పిడుగులు పడుతున్న సమయంలో వృక్షాలు, స్తంభాలు, మైదాన ప్రాంతాలు, ఆరుబయట వుండవద్దని సూచనలు ఇస్తుంటారు. అలాగే ఎలక్ట్రిక్ పరికరాలకు కూడా దూరంగా వుండాలని చెప్తారు. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో సెల్ ఫోన్లను ఉపయోగించకుండా వుండాలని సూచనలున్నాయి. ఐతే ఆ యువకుడు పిడుగులు పడుతున్న సమయంలో మొబైల్ ఫోను చూస్తున్నాడు. పక్కనే పిడుగు పడటంతో ఫోన్ పేలిపోయింది.
 
పూర్తి వివరాలు చూస్తే... అనకాపల్లిలోని వి.మాడుగుల మండలానికి చెందిన భవానీ శంకర్ అనే యువకుడు పిడుగులు పడుతున్న సమయంలో ఓ పూరి పాకలో వున్నాడు. తన సెల్ ఫోనును చూస్తూ వున్నాడు. అకస్మాత్తుగా పెద్ద శబ్దం చేస్తూ అతడు వున్న పూరిపాకకి పక్కనే వున్న పశువుల పాకపై పిడుగు పడింది. ఆ పిడుగు తీవ్రతకు యువకుడి చేతిలో వున్న సెల్ ఫోన్ పేలిపోయి అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్దమధ్యలో అతడు మృతి చెందాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments