Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధాన్ని అడ్డుకున్న భర్త.. కేబుల్ వైరుతో హతమార్చిన భార్య..

Webdunia
సోమవారం, 27 జులై 2015 (12:57 IST)
సభ్య సమాజం తలదించుకునే రీతిలో ఓ దారుణ సంఘటన ఒకటి చోటు చేసుకుంది. పర పురుషుడితో వివాహేతర సంబంధాన్ని అడ్డుకున్న భర్త గొంతును కేబుల్ వైరుతో బిగించి హత్య చేసింది ఓ కసాయి భార్య. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... విశాఖపట్నం జిల్లాలో కె.కోటపాడు మండలం మర్రివలస గ్రామానికి చెందిన కొండమ్మ అలియాస్ దొంగు దుర్గాలమ్మ భర్తతో అదే ప్రాంతంలో నివాసం ఉంటోంది. 
 
కొండమ్మకు అదే ప్రాంతంలో మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలియడంతో పలుసార్లు హెచ్చరించాడు. అయితే భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తీవ్రంగా ఖండించాడు. ఈ స్థితిలో తన భర్త నిద్రపోతుండగా ఆయన మెడకు కేబుల్ వైరు బిగించి ఊరితీసి చంపింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కొండమ్మను అదుపులోకి చేరుకుని విచారిస్తున్నారు. ఆమె భర్త మృత దేహాన్ని పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments