Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడిలో ఒంటరిగా యువతి... మీదకు రాబోయాడు... కత్తితో ఏసేసింది...

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (15:54 IST)
ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఓ యువతి ఒక యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన వెలుగు చూసింది. కాగా ఆత్మరక్షణ కోసమే దాడి చేసానని యువతి చెబుతోంది. అనంతపురం జిల్లా తనకల్లు మండల కేంద్రంలోని ఇందిరానగర్‌కి చెందిన స్వప్న అనే యువతి సోమవారం నాడు అయ్యప్ప ఆలయంలో ఒంటరిగా కూర్చొని ఉండగా, ఆలయ పూజారి బంధువు మంజునాథ్ లైట్లు వేసేందుకు స్విచ్‌బోర్డ్ దగ్గరకు వెళ్లబోయాడు. 
 
మంజునాథ్ దురుద్దేశంలోనే తన దగ్గరకు వస్తున్నాడని భావించిన స్వప్న అతడి తలపై కత్తితో దాడి చేసింది. దాడిలో గాయపడిన మంజునాథ్‌ని స్థానికులు, బంధువులు కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అనంతపురం ఆస్పత్రికి తరలించమని వైద్యులు సూచించారు. 
 
విషయం తెలుసుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆమె ఆత్మరక్షణ కోసమే మంజునాథ్‌పై దాడి చేయాల్సి వచ్చిందని పోలీసులకు తెలిపింది. ఒంటరిగా ఉన్న తన దగ్గరకు మంజునాథ్ రావడాన్ని గమనించి, దగ్గరకు రావద్దని ఎంత వారించినా అతను అటే రావడం వల్ల భయంతోనే కత్తితో అతడిపై దాడి చేసానని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments