Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో దారుణం: మూఢనమ్మకాలతో బిడ్డనే చంపేశాడు!

Webdunia
గురువారం, 16 జూన్ 2022 (17:49 IST)
నెల్లూరులో దారుణం చోటుచేసుకుంది. మూఢనమ్మకంతో కూతురినే చంపేశాడు.. ఓ కిరాతక తండ్రి. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని పేరారెడ్డిపల్లిలో ఆర్ధికంగా నష్టపోయిన వేణుగోపాల్ అనే వ్యక్తి మూఢనమ్మకాలతో తనకు చుట్టుకున్న చెడును వదిలించుకునే క్రమంలో కన్నకూతురు ప్రాణాలకే ముప్పు తెచ్చాడు. 
 
తనకు పట్టిన చెడు వదిలించుకునేందుకు మూడేళ్ల కూతురును పూజగదిలో ఉంచి పసుపునీళ్లు పోశాడు. అనంతరం నోట్లో కుంకుమ కుక్కాడు. దీంతో ఆ చిన్నారి ఊపిరాడక కేకలు పెట్టింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని ఆ కసాయి తండ్రి నుంచి కూతురుని రక్షించేందుకు విఫలయత్నం చేశారు. 
 
వెంటనే ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. పరిస్ధితి విషమం కావడంతో నెల్లూరు, అనంతరం చెన్నైకు కూడా తరలించినా ఆ చిన్నారిని బతికించలేకపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో మూవీ ప్రారంభం

Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగుకు బైబై చెప్పేయనున్న అక్కినేని నాగార్జున?

వెండితెరపై కనిపించనున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సొంత రాష్ట్రంలో రష్మికకు పెరిగిన నిరసనల సెగ!

సర్దార్ 2 కు కార్తి డబ్బింగ్ తో ప్రారంభమయింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

తర్వాతి కథనం
Show comments