Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో దారుణం: మూఢనమ్మకాలతో బిడ్డనే చంపేశాడు!

Webdunia
గురువారం, 16 జూన్ 2022 (17:49 IST)
నెల్లూరులో దారుణం చోటుచేసుకుంది. మూఢనమ్మకంతో కూతురినే చంపేశాడు.. ఓ కిరాతక తండ్రి. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని పేరారెడ్డిపల్లిలో ఆర్ధికంగా నష్టపోయిన వేణుగోపాల్ అనే వ్యక్తి మూఢనమ్మకాలతో తనకు చుట్టుకున్న చెడును వదిలించుకునే క్రమంలో కన్నకూతురు ప్రాణాలకే ముప్పు తెచ్చాడు. 
 
తనకు పట్టిన చెడు వదిలించుకునేందుకు మూడేళ్ల కూతురును పూజగదిలో ఉంచి పసుపునీళ్లు పోశాడు. అనంతరం నోట్లో కుంకుమ కుక్కాడు. దీంతో ఆ చిన్నారి ఊపిరాడక కేకలు పెట్టింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని ఆ కసాయి తండ్రి నుంచి కూతురుని రక్షించేందుకు విఫలయత్నం చేశారు. 
 
వెంటనే ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. పరిస్ధితి విషమం కావడంతో నెల్లూరు, అనంతరం చెన్నైకు కూడా తరలించినా ఆ చిన్నారిని బతికించలేకపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments