Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో దారుణం: మూఢనమ్మకాలతో బిడ్డనే చంపేశాడు!

Webdunia
గురువారం, 16 జూన్ 2022 (17:49 IST)
నెల్లూరులో దారుణం చోటుచేసుకుంది. మూఢనమ్మకంతో కూతురినే చంపేశాడు.. ఓ కిరాతక తండ్రి. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని పేరారెడ్డిపల్లిలో ఆర్ధికంగా నష్టపోయిన వేణుగోపాల్ అనే వ్యక్తి మూఢనమ్మకాలతో తనకు చుట్టుకున్న చెడును వదిలించుకునే క్రమంలో కన్నకూతురు ప్రాణాలకే ముప్పు తెచ్చాడు. 
 
తనకు పట్టిన చెడు వదిలించుకునేందుకు మూడేళ్ల కూతురును పూజగదిలో ఉంచి పసుపునీళ్లు పోశాడు. అనంతరం నోట్లో కుంకుమ కుక్కాడు. దీంతో ఆ చిన్నారి ఊపిరాడక కేకలు పెట్టింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని ఆ కసాయి తండ్రి నుంచి కూతురుని రక్షించేందుకు విఫలయత్నం చేశారు. 
 
వెంటనే ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. పరిస్ధితి విషమం కావడంతో నెల్లూరు, అనంతరం చెన్నైకు కూడా తరలించినా ఆ చిన్నారిని బతికించలేకపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments