Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో దళారీలు జాగ్రత్త.. శీఘ్ర దర్శన టికెట్లని అలా మోసం చేశారు

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (15:18 IST)
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో దళారీలు భక్తులను మోసం చేస్తున్నారు. ఉచిత సర్వదర్శన టోకెన్లను దళారీలు రూ.300ల శీఘ్ర దర్శన టికెట్లుగా భక్తులకు అంటగట్టారు. 
 
వివరాల్లోకి వెళితే..  మార్చి 30న గుంతకల్ కు చెందిన కొందరు భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శనార్ధం తిరుమలకు చేరుకున్నారు. అయితే సర్వదర్శనంలో దర్శనం ఆలస్యం అవుతుందని భావించిన భక్తులు.. శీఘ్ర దర్శన టోకెన్ల కోసం స్థానిక దళారీని ఆశ్రయించారు. 
 
ఈక్రమంలో దళారి కిరణ్ కుమార్ వారికి ఉచిత సర్వదర్శన టోకెన్లు ఇప్పించి..అవి రూ.300 విలువ చేసే శీఘ్ర దర్శన టోకెన్లుగా నమ్మించాడు. అంతే కాదు ఈ టోకెన్లతో ప్రత్యేక ప్రవేశద్వారం దర్శనం కల్పిస్తున్నామంటూ అదనంగా మరో రూ.200 భక్తుల నుంచి నొక్కేసాడు కిరణ్ కుమార్. 
 
ఇక శీఘ్ర దర్శన టోకెన్లు తీసుకున్న భక్తులు క్యూ కాంప్లెక్స్ లో రూ.300 ప్రవేశ ద్వారా వెళ్తుండగా..సిబ్బంది అవి సర్వదర్శన టోకెన్లు అంటూ వారించారు. దీంతో మోసపోయామని గ్రహించిన భక్తులు అక్కడే టీటీడీ విజిలెన్సు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు రంగంలోకి దిగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటనపై టీటీడీ అధికారుల నుంచి ఫిర్యాదు అందుకున్న తిరుపతి టూ టౌన్ పోలీసులు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిసున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments