Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో దళారీలు జాగ్రత్త.. శీఘ్ర దర్శన టికెట్లని అలా మోసం చేశారు

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (15:18 IST)
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో దళారీలు భక్తులను మోసం చేస్తున్నారు. ఉచిత సర్వదర్శన టోకెన్లను దళారీలు రూ.300ల శీఘ్ర దర్శన టికెట్లుగా భక్తులకు అంటగట్టారు. 
 
వివరాల్లోకి వెళితే..  మార్చి 30న గుంతకల్ కు చెందిన కొందరు భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శనార్ధం తిరుమలకు చేరుకున్నారు. అయితే సర్వదర్శనంలో దర్శనం ఆలస్యం అవుతుందని భావించిన భక్తులు.. శీఘ్ర దర్శన టోకెన్ల కోసం స్థానిక దళారీని ఆశ్రయించారు. 
 
ఈక్రమంలో దళారి కిరణ్ కుమార్ వారికి ఉచిత సర్వదర్శన టోకెన్లు ఇప్పించి..అవి రూ.300 విలువ చేసే శీఘ్ర దర్శన టోకెన్లుగా నమ్మించాడు. అంతే కాదు ఈ టోకెన్లతో ప్రత్యేక ప్రవేశద్వారం దర్శనం కల్పిస్తున్నామంటూ అదనంగా మరో రూ.200 భక్తుల నుంచి నొక్కేసాడు కిరణ్ కుమార్. 
 
ఇక శీఘ్ర దర్శన టోకెన్లు తీసుకున్న భక్తులు క్యూ కాంప్లెక్స్ లో రూ.300 ప్రవేశ ద్వారా వెళ్తుండగా..సిబ్బంది అవి సర్వదర్శన టోకెన్లు అంటూ వారించారు. దీంతో మోసపోయామని గ్రహించిన భక్తులు అక్కడే టీటీడీ విజిలెన్సు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు రంగంలోకి దిగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటనపై టీటీడీ అధికారుల నుంచి ఫిర్యాదు అందుకున్న తిరుపతి టూ టౌన్ పోలీసులు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments