Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరూ కావాలన్న పెళ్లయిన ప్రేయసి... ఇద్దరు ప్రియులు ఆ పని చేసారు...

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (22:32 IST)
సమాజంలో ఎప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో ఎవరూ చెప్పలేరు. కొంతమంది యువతులు అక్రమ సంబంధం పెట్టుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే మరికొంతమంది వివాహిత మహిళలు కూడా అక్రమ సంబంధాలతో పండంటి కాపురాన్ని నిలువునా కూల్చేసుకుంటున్నారు. అలాంటి సంఘటనే చిత్తూరు జిల్లా రేణిగుంటలో జరిగింది.
 
పాంచాలీనగర్‌కు చెందిన అనూషకు 27 సంవత్సరాలు. స్థానికంగా డిగ్రీ చదివి సమయంలో అనూషకు ఇద్దరు ప్రియుళ్ళు ఉన్నారు. అనూషకు వివాహమై సంవత్సరం అవుతోంది. అయినా ప్రియుళ్ళను మాత్రం మరిచిపోలేదు. భర్తతో కలిసి ఉంటూనే ఇద్దరు ప్రియుళ్ళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వస్తుండేది. 
 
ఇద్దరు ప్రియుళ్ళు సూరి, రాములు పూటుగా మద్యం సేవించి గొడవపడ్డారు. అనూషతో ఎవరో ఒకరు కలిసి ఉండాలి. ఇద్దరూ కలిసి ఉండకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో అనూషను రేణిగుంటలోని ఒక నిర్మానుష్యమైన అపార్టుమెంటుకు తీసుకెళ్ళారు.
 
ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఎంచుకో.. ఇద్దరూ వద్దు అంటూ పట్టుబట్టారు. తనకు ఇద్దరూ కావాలంటూ అనూష చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. రాము, సూరిలు ఇద్దరూ కలిసి అనూషను చంపి అపార్టుమెంట్‌లో ఉరివేసుకుందంటూ చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments