Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిలకలూరిపేట వద్ద రోడ్డుపై వెళుతున్న కారులో మంటలు, దగ్ధం

Webdunia
శనివారం, 1 మే 2021 (16:48 IST)
చిలకలూరిపేట: చెన్నై- కోల్కతా జాతీయ రహదారిపై నాదెండ్ల మండలం గణపవరం వద్ద గురువారం ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి తగలబడింది. తెనాలిలో మాంటిస్సోరి స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న జేమ్స్ మొరైలీ తన కుటుంబ సభ్యులు నలుగురితో కలిసి కేరళ వెళ్లి అక్కడి నుంచి చెన్నైకు, చెన్నై నుంచి తెనాలి వస్తున్నాడు.

సిఆర్ కళాశాల సమీపంలోకి రాగానే ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో కారు పక్కగా ఆపి అందరూ కిందకు దిగారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధం అవగా, రెండు ల్యాప్‌టాప్‌లు, 15 వేల రూపాయల నగదు, దుస్తులు కాలిపోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments