Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే హై ఓల్టేజ్ తీగలపై నడవాలని చూశాడు.. చివరికి?

Webdunia
బుధవారం, 13 నవంబరు 2019 (15:04 IST)
రైల్వే విద్యుత్ స్తంభంపైకి ఓ మతిస్థిమితం లేని వ్యక్తి హల్ చల్ చేశాడు. రైల్వే విద్యుత్ స్తంభం పైకి ఎక్కడమే కాకుండా దానిపై వేలాడే హై ఓల్టేజ్‌ తీగలపై నడిచే ప్రయత్నం చేశారు. ఈ ఘటన దబ్రా రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ వ్యక్తి తీగలపై నడిచేందుకు ప్రయత్నిస్తుండగా ఇది గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే ఆ దారిలో ఉన్న విద్యుత్‌ను నిలిపివేసింది. వెంటనే ఆ వ్యక్తిని కాపాడేందుకు సిబ్బంది రంగంలోకి దిగింది.
 
ఈ మొత్తం వ్యవహారంను అక్కడే ఉన్న కొందరు తమ సెల్‌ఫోన్లలో రికార్డు చేశారు. ఈ హై ఓల్టేజ్ డ్రామాను చూసేందుకు ప్లాట్‌ఫాంకు ఇరువైపులా పెద్ద ఎత్తున జనాలు గుమికూడారు. ఇక వారంతా చూస్తుండగానే ఈ వ్యక్తి తీగలపై వేలాడుతూ కొన్ని సర్కస్ ఫీట్లు చేశాడు. ఇక మరో ఇంజిన్‌లో చేరుకున్న రైల్వే సిబ్బంది ఆ వ్యక్తిని కాపాడి కిందకు దించారు. 
 
ఇదిలా ఉంటే ఆ వ్యక్తి చేసిన పనికి చాలా రైళ్లు గంటపాటు నిలిచిపోయాయి. విద్యుత్‌ను అధికారులు నిలిపివేయడంతో ఝాన్సీ రైల్వే డివిజన్‌లోని చాలా వరకు రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గ్వాలియర్‌కు సమీపంలో ఉన్న దాబ్రా రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. విద్యుత్ సరఫరా ఉన్న మరో వైర్‌ను ఆ వ్యక్తి ముట్టుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని రైల్వే అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments