Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే హై ఓల్టేజ్ తీగలపై నడవాలని చూశాడు.. చివరికి?

Webdunia
బుధవారం, 13 నవంబరు 2019 (15:04 IST)
రైల్వే విద్యుత్ స్తంభంపైకి ఓ మతిస్థిమితం లేని వ్యక్తి హల్ చల్ చేశాడు. రైల్వే విద్యుత్ స్తంభం పైకి ఎక్కడమే కాకుండా దానిపై వేలాడే హై ఓల్టేజ్‌ తీగలపై నడిచే ప్రయత్నం చేశారు. ఈ ఘటన దబ్రా రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ వ్యక్తి తీగలపై నడిచేందుకు ప్రయత్నిస్తుండగా ఇది గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే ఆ దారిలో ఉన్న విద్యుత్‌ను నిలిపివేసింది. వెంటనే ఆ వ్యక్తిని కాపాడేందుకు సిబ్బంది రంగంలోకి దిగింది.
 
ఈ మొత్తం వ్యవహారంను అక్కడే ఉన్న కొందరు తమ సెల్‌ఫోన్లలో రికార్డు చేశారు. ఈ హై ఓల్టేజ్ డ్రామాను చూసేందుకు ప్లాట్‌ఫాంకు ఇరువైపులా పెద్ద ఎత్తున జనాలు గుమికూడారు. ఇక వారంతా చూస్తుండగానే ఈ వ్యక్తి తీగలపై వేలాడుతూ కొన్ని సర్కస్ ఫీట్లు చేశాడు. ఇక మరో ఇంజిన్‌లో చేరుకున్న రైల్వే సిబ్బంది ఆ వ్యక్తిని కాపాడి కిందకు దించారు. 
 
ఇదిలా ఉంటే ఆ వ్యక్తి చేసిన పనికి చాలా రైళ్లు గంటపాటు నిలిచిపోయాయి. విద్యుత్‌ను అధికారులు నిలిపివేయడంతో ఝాన్సీ రైల్వే డివిజన్‌లోని చాలా వరకు రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గ్వాలియర్‌కు సమీపంలో ఉన్న దాబ్రా రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. విద్యుత్ సరఫరా ఉన్న మరో వైర్‌ను ఆ వ్యక్తి ముట్టుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని రైల్వే అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments