Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాలంటీర్ల పోస్టులకి రాజీనామా చేసిన 850 మంది, వీరి అసలు రూపం ఇదేనంటున్న తెదేపా

ఐవీఆర్
బుధవారం, 3 ఏప్రియల్ 2024 (15:51 IST)
కృష్ణాజిల్లాకు చెందిన 850 మంది వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేసారు. వీరిలో ఎక్కువమంది మచిలీపట్నం నియోజకవర్గానికి చెందినవారుగా వున్నారు. వాలంటీర్లుగా తాము గత ఐదేళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నానీ, ఎన్నికల సంఘం నిబంధనలతో తాము తమ పనిచేసే అవకాశం లేకుండా పోయిందన్నారు. పెన్షనర్లకు డబ్బులు ఇచ్చేటపుడు వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తారన్న ఫిర్యాదులతో వీరిని సీఈసి దూరంగా పెట్టింది. పెన్షన్లను అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. త్వరలో ఏర్పాట్లు చేస్తామని ఏపీ సీఎస్ తెలిపారు.
 
వాలంటీర్ల పోస్టులకు రాజీనామాలు చేసినవారు మాట్లాడుతూ... పేదల కోసం తాము గత ఐదేళ్లుగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈసీ నిర్ణయంతో తాము ఏమీ చేయలేకపోతున్నామనీ, అందుకునే ఉద్యోగాలు మానేసి వైసిపి కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. వీరి నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు మాట్లాడుతూ... వారి ముసుగు తొలగి అసలు రూపం బయటపడింది. వారంతా పార్టీవారే. వాలంటీర్లు కాదు. ప్రజలకు సేవ చేస్తామని చెప్పి ఆ ముసుగులో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments