వాలంటీర్ల పోస్టులకి రాజీనామా చేసిన 850 మంది, వీరి అసలు రూపం ఇదేనంటున్న తెదేపా

ఐవీఆర్
బుధవారం, 3 ఏప్రియల్ 2024 (15:51 IST)
కృష్ణాజిల్లాకు చెందిన 850 మంది వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేసారు. వీరిలో ఎక్కువమంది మచిలీపట్నం నియోజకవర్గానికి చెందినవారుగా వున్నారు. వాలంటీర్లుగా తాము గత ఐదేళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నానీ, ఎన్నికల సంఘం నిబంధనలతో తాము తమ పనిచేసే అవకాశం లేకుండా పోయిందన్నారు. పెన్షనర్లకు డబ్బులు ఇచ్చేటపుడు వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తారన్న ఫిర్యాదులతో వీరిని సీఈసి దూరంగా పెట్టింది. పెన్షన్లను అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. త్వరలో ఏర్పాట్లు చేస్తామని ఏపీ సీఎస్ తెలిపారు.
 
వాలంటీర్ల పోస్టులకు రాజీనామాలు చేసినవారు మాట్లాడుతూ... పేదల కోసం తాము గత ఐదేళ్లుగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈసీ నిర్ణయంతో తాము ఏమీ చేయలేకపోతున్నామనీ, అందుకునే ఉద్యోగాలు మానేసి వైసిపి కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. వీరి నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు మాట్లాడుతూ... వారి ముసుగు తొలగి అసలు రూపం బయటపడింది. వారంతా పార్టీవారే. వాలంటీర్లు కాదు. ప్రజలకు సేవ చేస్తామని చెప్పి ఆ ముసుగులో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర డియోల్ ఇకలేరు

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments