Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త మంత్రివర్గంలో ఎనిమిది జిల్లాలకు ప్రాతినిథ్యం నిల్!

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2022 (07:34 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తన కొత్త మంత్రివర్గం జాబితాను ప్రకటిచారు. ఇందులో ఎనిమిది జిల్లాలకు ప్రాతినిథ్యం దక్కలేదు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. కానీ, తన మంత్రివర్గంలో అన్ని జిల్లాలకు ప్రాతినిథ్యం కల్పించాల్సివుంది. కానీ, కొత్తగా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఎనిమిది జిల్లాలకు ప్రాతినిథ్యం కల్పించలేదు. 
 
ఈ జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఇద్దరికి, ముగ్గురికి కూడా చోటు కల్పించిన జగన్.. ఈ ఎనిమిది జిల్లాలకు మాత్రం ఒక్కరంటే ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ముగ్గురికి చోటు కల్పించారు. వీరిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఆర్కే రోజాలు ఉన్నారు. 
 
అలాగే, శ్రీకాకుళం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, పల్నాడు జిల్లాల్లో ఇద్దరేసి ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో ఉన్నారు. విజయనగరం, మన్యం పార్వతీపురం, కాకినాడ, తూర్పుగోదావరి, బాపట్ల, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల నుంచి ఒక్కొక్కరికి మంత్రివర్గంలో చోటిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments