Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త మంత్రివర్గంలో ఎనిమిది జిల్లాలకు ప్రాతినిథ్యం నిల్!

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2022 (07:34 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తన కొత్త మంత్రివర్గం జాబితాను ప్రకటిచారు. ఇందులో ఎనిమిది జిల్లాలకు ప్రాతినిథ్యం దక్కలేదు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. కానీ, తన మంత్రివర్గంలో అన్ని జిల్లాలకు ప్రాతినిథ్యం కల్పించాల్సివుంది. కానీ, కొత్తగా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఎనిమిది జిల్లాలకు ప్రాతినిథ్యం కల్పించలేదు. 
 
ఈ జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఇద్దరికి, ముగ్గురికి కూడా చోటు కల్పించిన జగన్.. ఈ ఎనిమిది జిల్లాలకు మాత్రం ఒక్కరంటే ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ముగ్గురికి చోటు కల్పించారు. వీరిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఆర్కే రోజాలు ఉన్నారు. 
 
అలాగే, శ్రీకాకుళం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, పల్నాడు జిల్లాల్లో ఇద్దరేసి ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో ఉన్నారు. విజయనగరం, మన్యం పార్వతీపురం, కాకినాడ, తూర్పుగోదావరి, బాపట్ల, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల నుంచి ఒక్కొక్కరికి మంత్రివర్గంలో చోటిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments