Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త మంత్రివర్గంలో ఎనిమిది జిల్లాలకు ప్రాతినిథ్యం నిల్!

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2022 (07:34 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తన కొత్త మంత్రివర్గం జాబితాను ప్రకటిచారు. ఇందులో ఎనిమిది జిల్లాలకు ప్రాతినిథ్యం దక్కలేదు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. కానీ, తన మంత్రివర్గంలో అన్ని జిల్లాలకు ప్రాతినిథ్యం కల్పించాల్సివుంది. కానీ, కొత్తగా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఎనిమిది జిల్లాలకు ప్రాతినిథ్యం కల్పించలేదు. 
 
ఈ జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఇద్దరికి, ముగ్గురికి కూడా చోటు కల్పించిన జగన్.. ఈ ఎనిమిది జిల్లాలకు మాత్రం ఒక్కరంటే ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ముగ్గురికి చోటు కల్పించారు. వీరిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఆర్కే రోజాలు ఉన్నారు. 
 
అలాగే, శ్రీకాకుళం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, పల్నాడు జిల్లాల్లో ఇద్దరేసి ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో ఉన్నారు. విజయనగరం, మన్యం పార్వతీపురం, కాకినాడ, తూర్పుగోదావరి, బాపట్ల, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల నుంచి ఒక్కొక్కరికి మంత్రివర్గంలో చోటిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments