Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు... ఏడుగురి మృతి

Webdunia
మంగళవారం, 11 జులై 2023 (08:44 IST)
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సు ఒకటి నాగార్జున సాగర్ కుడి కాలువలో బోల్తాపడింది. ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో సాగర్ కెనాల్‌లో పెళ్లి బృందం బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృత్యువాతపడగా, మరో 12 మంది గాయపడ్డారు. ఈ బస్సు పొదిలి నుంచి కాకినాడ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో 35 నుంచి 40 మంది వరకు ఉన్నట్టు సమాచారం. 
 
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాకినాడలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి వెళ్లేందుకు ఈ పెళ్లి బృందం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకుంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని పొదిలి గ్రామానికి చెందిన అబ్దుల్ అజీజ్ (65), అబ్దుల్ హానీ (60), షేక్ రమీజ్ (48), ముల్లా నూర్జహాన్ (58), ముల్లా జానీబేగం (65), షేక్ షబీనా (35), షేక్ హీనా (6)లుగా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments