Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాళహస్తిలో ఆటో లారీ ఢీ.. ఏడుగురు మృతి

Webdunia
గురువారం, 26 ఫిబ్రవరి 2015 (08:47 IST)
పట్నం వచ్చి పనులు చూసుకుని తిరిగి వారి వారి ఊళ్లకు వెళ్లే హడావుడీలో ఆటో లేదా జీపు ఏది దొరికితే దానిని పట్టుకుని ప్రయాణం చేయడం షరామామూలే. అయితే అదే వారి పాలిట శాపంగా మారింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని తిమ్మసముద్రం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరణించిన వారిలో నలుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. హృదయవిదారకమైన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
శ్రీకాళహస్తి సమీపంలోని బుచ్చినాయుడు కండ్రిగ మండలానికి చెందిన పల్లెల జనం సాధారణంగా శ్రీకాళహస్తి పట్టణానికి రావడం అవసరమైనవి కొనుగోలు చేసుకోవడం సాయంత్రం తిరుగు ప్రయాణం అవుతుంటారు. బుధవారం కూడా సరిగ్గా ఇలాగే కొంత మంది శ్రీకాళహస్తిలు తమ పనులు ముగించుకుని ఆటోలో సొంత ఊళ్ళకు బయలుదేరారు. అందులో అప్పటికే 15 ప్రయాణీకులు ఉన్నారు.
 
అయితే వారు ప్రయాణిస్తున్న ఆటోను తిమ్మ సముద్రం గ్రామం వద్దకు రాగానే వేగంగా వస్తున్న లారీ ఒకటి ఢీకొనడంతో ఏడుగురు మరణించారు. వారులో నలుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. అందులోంచి మృతదేహాలను బయటకు లాగడానికి చుట్టుపక్కల పల్లెల జనంతోపాటు పోలీసులు కూడా తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. గాయపడ్డవారిని సమీపంలో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments