పసిబిడ్డను నీళ్ల డ్రమ్ములో ముంచి హత్య చేశారు..

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (17:44 IST)
నిద్రపోతున్న ఆరు నెలల మగ శిశువును నీళ్ల డ్రమ్‌లో వేసి దారుణంగా హత్య చేసారు. ఉయ్యాలలో బిడ్డ కనిపించకపోవడంతో తల్లి, బంధువులు అందరూ కలిసి వెతకగా నీళ్ల డ్రమ్‌లో శవమై తేలి ఉన్నాడు. ఈ ఘటన శ్రీరంగరాజపురం మండలం పిల్లిగుండ్లపల్లె ఒంటిల్లులో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం పిల్లిగుండ్లపల్లె ఒంటిల్లు దళితవాడకు చెందిన భువనేశ్వరి(22), అదే మండలానికి చెందిన ఎగువమెదవాడ దళితవాడకు చెందిన వినోద్‌కుమార్‌(27) ప్రేమించుకున్నారు. 
 
పెద్దలను ఎదిరించి మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వినోద్‌కుమార్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆమె ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చింది. రెండవ కొడుకు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన తర్వాత ఆమె తల్లిదండ్రులు ఆమెను చేరదీశారు. దాంతో భువనేశ్వరి పిలిగుండ్లపల్లె ఒంటిల్లులోని అమ్మగారింటికి వచ్చింది. సమీప బంధువు చనిపోవడంతో తల్లిదండ్రులు అంత్యక్రియలకు వెళ్లారు. 
 
భువనేశ్వరి, తనతోపాటు అక్క రేవతి మంగళవారం ఆరు నెలల శిశువును ఉయ్యాలలో నిద్రపుచ్చి, వారు కూడా ఇంట్లోనే నిద్రిస్తున్నారు. కొద్దిసేపటికి భువనేశ్వరికి మెలుకువ వచ్చి చూడగా ఉయ్యాలలో బిడ్డ కనిపించలేదు. చుట్టు ప్రక్కల వెతికి చూశారు, కానీ బిడ్డ దొరకలేదు. ఇంతలో చుట్టుప్రక్కల వాళ్లు బంధువులు అందరూ కలిసి వెతకగా చివరికి నీళ్ల డ్రమ్‌లో చనిపోయి ఉన్నాడు. 
 
ఈ విషయం తెలుసుకుని వినోద్‌కుమార్ అక్కడికి వచ్చాడు. బోరున విలపించాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  ప్రారంభించారు. త్వరలోనే దోషులను పట్టుకుంటామని చెప్పారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments