Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురి దుర్మరణం!

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (10:29 IST)
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. గోరంట్ల మండల పరిధిలోని బూచేపల్లి బస్‌స్టాప్ వద్ద ఆటో, లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో ఆరుగురు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. 
 
మృతులందరూ పుట్టపర్తి మండలం పెడబల్లికి చెందిన వారుగా గుర్తించారు. మృతి చెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా కూలి పనుల కోసం కర్ణాటకలోని బాగేపల్లి మార్కెట్‌కు ఆటోలో వెళుతుండగా ఈ దారుణం సంభవించింది. బెంగళూరు నుంచి తాడిపత్రి వస్తున్న లారీ ఎదురుగా వచ్చి ఆటోను ఢీకొంది. క్షతగాత్రులను హిందూపురం ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments