Webdunia - Bharat's app for daily news and videos

Install App

570వ రోజుకు అమరావతి ఉద్యమం

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (11:04 IST)
ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని రైతులు చేస్తున్న ఉద్యమం శుక్రవారం 570వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... మూడు రాజధానులతో ప్రయోజనం లేదని తెలిసినా, రాజకీయ కక్షతోనే ఆ ప్రతిపాదన తెచ్చారన్నారు.

రైతులు  భూములు స్వచ్ఛందంగా ఇస్తే,  కొంత మంది వైసీపీ ప్రజాప్రతినిధులు లాక్కున్నారని ప్రచారం చేయటం వెనక కూడా కుట్ర దాగుందన్నారు. రూ.పది వేల కోట్లతో  అమరావతిలో పనులు జరిగితే అసలు ఏమీ జరగలేదని తప్పుడు ప్రచారం చేశారన్నారు. 

అమరావతి అభివృద్ధి ఆగిపోవటంతో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు  ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అమరావతిని తరలించటానికి ప్రభుత్వం రోజుకో కొత్త నాటకానికి తెరతీస్తుందన్నారు. అమరావతి కోసం రైతులకు మద్దతుగా దీక్ష చేస్తానని ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌ ఎందుకు దీక్షలు చేపట్టలేదు, ఎందుకు ప్రశ్నించటం లేదని దుయ్యబట్టారు.

మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్‌లో చట్ట సవరణ జరగాలని పేర్కొన్నారు. అమరావతి శ్మశానం కాదని రాష్ట్రాభివృద్దికి నిదర్శనమని అన్నారు. మూడు రాజధానుల ప్రకటనను వెనకకు తీసుకునే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments