Webdunia - Bharat's app for daily news and videos

Install App

570వ రోజుకు అమరావతి ఉద్యమం

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (11:04 IST)
ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని రైతులు చేస్తున్న ఉద్యమం శుక్రవారం 570వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... మూడు రాజధానులతో ప్రయోజనం లేదని తెలిసినా, రాజకీయ కక్షతోనే ఆ ప్రతిపాదన తెచ్చారన్నారు.

రైతులు  భూములు స్వచ్ఛందంగా ఇస్తే,  కొంత మంది వైసీపీ ప్రజాప్రతినిధులు లాక్కున్నారని ప్రచారం చేయటం వెనక కూడా కుట్ర దాగుందన్నారు. రూ.పది వేల కోట్లతో  అమరావతిలో పనులు జరిగితే అసలు ఏమీ జరగలేదని తప్పుడు ప్రచారం చేశారన్నారు. 

అమరావతి అభివృద్ధి ఆగిపోవటంతో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు  ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అమరావతిని తరలించటానికి ప్రభుత్వం రోజుకో కొత్త నాటకానికి తెరతీస్తుందన్నారు. అమరావతి కోసం రైతులకు మద్దతుగా దీక్ష చేస్తానని ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌ ఎందుకు దీక్షలు చేపట్టలేదు, ఎందుకు ప్రశ్నించటం లేదని దుయ్యబట్టారు.

మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్‌లో చట్ట సవరణ జరగాలని పేర్కొన్నారు. అమరావతి శ్మశానం కాదని రాష్ట్రాభివృద్దికి నిదర్శనమని అన్నారు. మూడు రాజధానుల ప్రకటనను వెనకకు తీసుకునే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments