Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదాములో 3708 బస్తాల బియ్యం మాయం: అరెస్ట్ భయంతో పేర్ని నాని అజ్ఞాతం?

ఐవీఆర్
శనివారం, 14 డిశెంబరు 2024 (16:43 IST)
వారంలో కనీసం రెండుమూడు రోజులకు తగ్గకుండా మీడియా ముందు కనిపించే వైసిపి నాయకుడు పేర్ని నాని ఇపుడు కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం తన భార్య పేరుపై వున్న గోదాములో నిల్వ వుంచిన 3,708 బస్తాల బియ్యం మాయమయ్యాయి. దీనితో పౌరసరఫరాల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు గోదాము మేనేజర్ మానస్ తేజపైన మచిలీపట్నం తాలూకా పోలీసు స్టేషనులో కేసులు నమోదు చేసారు.
 
దీనితో అరెస్ట్ భయంతో జయసుధ ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేసారు. ఈ కేసు ఈ నెల 16కి వాయిదా పడింది. గోదాములో ఇలా భారీస్థాయిలో బియ్యం మాయమైన దగ్గర్నుంచి పేర్ని నాని కుటుంబం మొత్తం అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. శుక్రవారం వైసిపి తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలకు కూడా పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు కిట్టు కూడా కనిపించలేదు. దీనితో వీరిని త్వరలో పోలీసులు అరెస్ట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments