Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిడ్జిని ఢీకొట్టి 40 అడుగుల ఎత్తు నుంచి వాగులోపడిన బస్సు... విషాద యాత్రగా విహార యాత్ర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం మరో రెండు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. కృష్ణా జిల్లాలో దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాదానికి గురైన సంఘటన మరచిపోకముందే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మరో రెండు ప

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (10:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం మరో రెండు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. కృష్ణా జిల్లాలో దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాదానికి గురైన సంఘటన మరచిపోకముందే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మరో రెండు ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాల్లో అదృష్టవశాత్తు ఏ ఒక్కరూ మరణించలేదు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ప్రకాశం జిల్లా పెద్దచెర్లోపల్లి మండలం అలవలపాడు దగ్గర పాలేరు వంతెనను డీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టి వాగులో పడిపోయింది. దీంతో ఆ బస్సులో ప్రయాణించే 70 మంది విద్యార్థులకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ విద్యార్థులందరు యాగంటి, మహానంది విహారయాత్రకు వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరిని కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులంతా ఉవలపాడు మండలం కరేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందినవారని గుర్తించారు.
 
అలాగే, జిల్లాలోని దొరవారిసత్రం మండలం నెలబల్లి సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. రెండు ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. మహిళా ఉద్యోగులతో వెళ్తున్న ఓ బస్సును విజయవాడ నుంచి నెల్లూరుకు వెళ్తున్న వెంకటేశ్వర ట్రావెల్స్‌ వోల్వో బస్సు  వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments