Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి ఎస్వీ జూలో మూడేళ్ల బాలుడు మృతి

Webdunia
గురువారం, 4 మే 2023 (14:50 IST)
తిరుపతిలో ఎస్వీ జూ పార్కులో విషాదకర ఘటన ఒకటి జరిగింది. బ్యాటరీ వాహనం ఢీకొట్టడంతో మూడేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. తిరుపతి రాయల్ నగర్‌కు చెందిన మనోజ్ అనే వ్యక్తి బెంగుళూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో పని చేస్తున్నాడు. ఆయన భార్య సుష్మ. తిరుపతిలో ఉంటుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. అయితే, పిల్లలకు వేసవి సెలవు ఇవ్వడంతో సుష్మ తన ముగ్గురు పిల్లలతో పాటు సోదరుడిని కుమారుడిని తిరుపతిలో ఎస్వీ జూ పార్కుకు విహారానికి తీసుకెళ్ళారు. 
 
జూ పార్కులో ఒక చేత్లో కన్నబిడ్డను, మరో చేత్తో మేనల్లుడుని పట్టుకుని నడిచి వెళుతుండగా, సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన బ్యాటరీ వాహనం వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. బ్యాటరీ వాహనం చక్రాలు బాలుడిపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని గమనించిన జూ పార్కు సిబ్బంది హుటాహుటిన రుయా ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. 
 
అప్పటివరకు తన ముందే ఉన్న కుమారుడు చనిపోయాడని తెలియడంతో తల్లి కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. బ్యాటరీ వాహన డ్రైవర్‌ అజాగ్రత్త, వాహనాన్ని వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments