Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి ఎస్వీ జూలో మూడేళ్ల బాలుడు మృతి

Webdunia
గురువారం, 4 మే 2023 (14:50 IST)
తిరుపతిలో ఎస్వీ జూ పార్కులో విషాదకర ఘటన ఒకటి జరిగింది. బ్యాటరీ వాహనం ఢీకొట్టడంతో మూడేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. తిరుపతి రాయల్ నగర్‌కు చెందిన మనోజ్ అనే వ్యక్తి బెంగుళూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో పని చేస్తున్నాడు. ఆయన భార్య సుష్మ. తిరుపతిలో ఉంటుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. అయితే, పిల్లలకు వేసవి సెలవు ఇవ్వడంతో సుష్మ తన ముగ్గురు పిల్లలతో పాటు సోదరుడిని కుమారుడిని తిరుపతిలో ఎస్వీ జూ పార్కుకు విహారానికి తీసుకెళ్ళారు. 
 
జూ పార్కులో ఒక చేత్లో కన్నబిడ్డను, మరో చేత్తో మేనల్లుడుని పట్టుకుని నడిచి వెళుతుండగా, సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన బ్యాటరీ వాహనం వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. బ్యాటరీ వాహనం చక్రాలు బాలుడిపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని గమనించిన జూ పార్కు సిబ్బంది హుటాహుటిన రుయా ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. 
 
అప్పటివరకు తన ముందే ఉన్న కుమారుడు చనిపోయాడని తెలియడంతో తల్లి కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. బ్యాటరీ వాహన డ్రైవర్‌ అజాగ్రత్త, వాహనాన్ని వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments