Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమ‌ల‌లో మూడు రోజులు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (16:14 IST)
తిరుమ‌ల‌కు వ‌చ్చే వి.ఐ.పి. ల‌కు మూడు రోజుల పాటు ద‌ర్శ‌నాలు ర‌ద్ద‌య్యాయి. నవంబరు 13, 14, 15వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్న‌ట్లు టిటిడి పాల‌క వ‌ర్గం పేర్కొంది. నవంబ‌రు 12, 13 14వ తేదీల్లో సిఫార్సు లేఖలు స్వీకరించం అని తేల్చి చెప్పారు. 
 
 
తిరుప‌తి న‌గ‌రంలో నవంబరు 14న ద‌క్షిణాది రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌మావేశం ఉన్న నేప‌థ్యంలో నవంబరు 13, 14, 15వ తేదీల్లో తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను టిటిడి ర‌ద్దు చేసింది. ఆ రోజు తిరుప‌తికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు ద‌క్షిణాది రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు వ‌స్తున్నారు.  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్యక్షతన తిరుపతిలో జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశానికి వీరంతా హాజ‌ర‌వుతున్నారు.

 
ఈ కారణంగా నవంబ‌రు 12, 13 14వ తేదీల్లో విఐపి బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించం అని, భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments