Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా కార్యకర్త ఇంటిలో ఢిల్లీ మద్యం బాటిళ్లు

Webdunia
ఆదివారం, 25 జూన్ 2023 (11:38 IST)
ఏపీలోని బాపట్ల జిల్లా కర్లపాళెం మండలంలోని సత్యవతిపేటకు చెందిన వైకాపా కార్యకర్త కప్పల నారాయణ రెడ్డి ఇంటిలో ఢిల్లీ మద్యం బాటిళ్ళు లభ్యమయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం తెలుకున్న స్థానిక పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి ఆ ఇంటిపై సోదాలు చేయగా, రూ.1.50 లక్షల విలువ చేసే 277 మద్య సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలేనికి చెందిన వైకాపా కార్యకర్త మారుబోయిన వెంకటేశ్వర రెడ్డి ఢిల్లీలో తక్కువ ధరకు మద్యం సీసాలు కొనుగోలు చేసి రైలులో తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నారు. తొలుత పదుల సంఖ్యలో మద్యం సీసాలు తెచ్చి తన మామ కప్పల నారాయణ రెడ్డితో కలిసి విక్రయించేవారు. 
 
రోజులు గడిచేకొద్దీ... ఈ వ్యాపారంలో ఆదాయం బాగా వస్తుండడంతో ఇద్దరూ ఢిల్లీ వెళ్లి వందల సంఖ్యలో మద్యం సీసాలు కొనుగోలు చేసి సత్యవతిపేటలోని నారాయణ రెడ్డి ఇంట్లో నిల్వ చేస్తున్నారు. వాటిని స్థానికంగానే కాకుండా జిల్లాలోని నిజాంపట్నంలోనూ విక్రయించసాగారు. ఢిల్లీలో ఒక్కో సీసా రూ.130 చొప్పున కొనుగోలు చేసి ఇక్కడ రూ.600 నుంచి రూ.700 వరకు విక్రయిస్తూ లాభం గడించసాగారు. దీంతో పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments