Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా కార్యకర్త ఇంటిలో ఢిల్లీ మద్యం బాటిళ్లు

Webdunia
ఆదివారం, 25 జూన్ 2023 (11:38 IST)
ఏపీలోని బాపట్ల జిల్లా కర్లపాళెం మండలంలోని సత్యవతిపేటకు చెందిన వైకాపా కార్యకర్త కప్పల నారాయణ రెడ్డి ఇంటిలో ఢిల్లీ మద్యం బాటిళ్ళు లభ్యమయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం తెలుకున్న స్థానిక పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి ఆ ఇంటిపై సోదాలు చేయగా, రూ.1.50 లక్షల విలువ చేసే 277 మద్య సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలేనికి చెందిన వైకాపా కార్యకర్త మారుబోయిన వెంకటేశ్వర రెడ్డి ఢిల్లీలో తక్కువ ధరకు మద్యం సీసాలు కొనుగోలు చేసి రైలులో తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నారు. తొలుత పదుల సంఖ్యలో మద్యం సీసాలు తెచ్చి తన మామ కప్పల నారాయణ రెడ్డితో కలిసి విక్రయించేవారు. 
 
రోజులు గడిచేకొద్దీ... ఈ వ్యాపారంలో ఆదాయం బాగా వస్తుండడంతో ఇద్దరూ ఢిల్లీ వెళ్లి వందల సంఖ్యలో మద్యం సీసాలు కొనుగోలు చేసి సత్యవతిపేటలోని నారాయణ రెడ్డి ఇంట్లో నిల్వ చేస్తున్నారు. వాటిని స్థానికంగానే కాకుండా జిల్లాలోని నిజాంపట్నంలోనూ విక్రయించసాగారు. ఢిల్లీలో ఒక్కో సీసా రూ.130 చొప్పున కొనుగోలు చేసి ఇక్కడ రూ.600 నుంచి రూ.700 వరకు విక్రయిస్తూ లాభం గడించసాగారు. దీంతో పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments