Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క సినిమా టిక్కెట్‌పై 2 శాతం కమిషన్.. థియేటర్ వద్ద నో సేల్

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (12:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్ల టిక్కెట్లను కేవలం ఆన్‌లైన్ పోర్టల్‌లోనే విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. తద్వారా ఒక్కో సినిమా టిక్కెట్‌పై 2 శాతం కమిషన్‌ను వసూలు చేయాలని తాజాగా ప్రభుత్వం జీవో జారీచేసింది. 
 
పైగా, ఆన్‌లైన్ టిక్కెట్ విక్రయాలు ప్రారంభమైతే థియేటర్ వద్ద భౌతికంగా సినిమా టిక్కెట్లను విక్రయించరు. ఈ మేరకు ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ టిక్కెట్లను విక్రయించనుంది. 
 
ఇకపై రాష్ట్రంలో ఏ థియేటర్‌‍లోనూ సినిమా చూడాలన్నా ఇదే పోర్టల్‌ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయాలి. బుక్‌మై షో యాప్ వంటి ఇతర పోర్టల్స్‌ ద్వారా కొనుగోలు చేసినా ప్రభుత్వం 2 శాతం కమిషన్ చెల్లించాల్సివుంటుంది.

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments