Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడివాడ రైల్వే స్టేషన్ లో 2 కొత్త లిఫ్టులు

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (13:29 IST)
ప్రయాణీకుల సౌకర్యార్దం దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ గుడివాడ రైల్వే స్టేషన్ వద్ద 2 కొత్త లిఫ్టులను ప్రయాణీకుల సౌకర్యార్దం ప్రారంభించారు. ఈ లిఫ్టులు వలన ప్రయాణీకులు ముఖ్యంగా దివ్యంగులు, పిల్లలు, సీనియర్ సిటిజన్లు మరియు గర్భిణీ స్త్రీలు తమ బోర్డింగ్ పాయింట్లను సులభంగా చేరుకోవచ్చు. 

ఈ 2 లిఫ్ట్‌లను రూ. 1 కోటి మరియు పనులను అనుకున్న తేదీల ప్రకారం పూర్తయ్యాయి.  రెండు లిఫ్టులు 13 మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.  గుడివాడ స్టేషన్ వద్ద, ఈ రెండు కొత్త లిఫ్ట్‌లను ప్లాట్‌ఫాం నంబర్ 1 లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వద్ద ప్రధాన ద్వారం దగ్గర మరియు ఐలాండ్ ప్లాట్‌ఫాం 283 లో ఏర్పాటు చేశారు. 

గుడివాడలోని అన్ని ప్లాట్‌ఫాంలు రైలు ప్రయాణికుల సౌలభ్యం కోసం లిఫ్ట్ సౌకర్యంతో అనుసంధానించబడి ఉన్నాయి.  అలాగే, 2020-21 ఆర్థిక సంవత్సరానికి 9 లిఫ్ట్‌ల లక్ష్యానికి గాను విజయవాడ డివిజన్ ఇప్పటికే 9 కొత్త లిఫ్ట్‌లను ఏర్పాటు చేసింది. 

2021 జనవరి చివరి నాటికి బాపట్ల వద్ద రెండు కొత్త లిఫ్ట్‌లను ఆరంభించే పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. విజయవాడ డివిజన్‌కు అన్నవరం, కాకినాడ పట్టణం మరియు రాజమండ్రి వద్ద 3 కొత్త లిఫ్ట్‌లను కొనుగోలు చేయడానికి మరియు ఆరంభించడానికి అనుమతి లభించింది. 

విజయవాడ రైల్వే స్టేషన్లు, కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు తగ్గిబందున   పనులు, ప్రయాణీకుల సౌకర్యాలు మరియు ఇతర నిర్వహణ పనులను చురుగ్గా పూర్తి చేయడానికి డివిజన్ ముందుకు సాగుతోంది. దీనితో, ఇప్పుడు విజయవాడ డివిజన్‌లో 15 స్టేషన్లు మరియు 18 ఎస్కలేటర్లలో 40 లిఫ్ట్‌లు ఉన్నాయి .

7 స్టేషన్లలో  విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ పి. శ్రీనివాస్, ఈ సంవత్సరం 9 లిఫ్ట్‌ల ప్రతిపాదిత లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ / మెయింటెనెన్స్, ఆర్‌విఎన్ఎల్ సిబ్బంది మరియు ఎలక్ట్రికల్ & ఇంజనీరింగ్ బృందం వి. వెంకట రమణను అభినందించారు. 

ఈ కొత్త లిఫ్ట్‌లు ప్రయాణీకుల సౌకర్యాలకు  అదనంగా ఉంటాయని, డివిజన్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో  ప్రయాణీకులకు సులభతరం చేస్తాయని కూడా డిఆర్‌ఎం తెలిపారు. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments