Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిని కాళ్లుచేతులు కట్టేసి.. కిరోసిన్ పోసి నిప్పంటించారు...

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2020 (14:52 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్ పూర్ జిల్లాలో దారుణం జరిగింది. పాతకక్షలు బుసలు కొట్టాయి. ఫలితంగా అభంశుభం తెలియని 16 యేళ్ల అమ్మాయిని కాళ్లు చేతులు కట్టేసి వంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవదహనం చేశారు. జిల్లాలోని తాదార్శ గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 
 
ఈ గ్రామంలో రెండు కుటుంబాల మధ్య జూన్ నెలలో గొడవలు జరిగాయి. దీంతో ఇరు కుటుంబాలు స్థానిక పోలీస్ట్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో బాలిక తండ్రిని గతంలో అరెస్టు చేశారు. ఆ తర్వాత అతను బెయిలుపై విడుదలయ్యారు. 
 
ఈ క్రమంలో పాత కక్షలు మళ్లీ చెలరేగాయి. దీంతో పక్కింట్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు 18 ఏళ్ల అమ్మాయిని పట్టుకొని కాళ్లు చేతులు కట్టేసి అనంతరం అమ్మాయిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. స్థానికులు స్పందించి మంటలను ఆర్పేసి బాధితురాలిని లక్నో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 
 
ఆమె చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూసింది. బల్డిరాయ్ పోలీస్ అధికారి విజయ్ మాల్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments