శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కరోనా.. భక్తులు లేకుండానే రాముని కల్యాణం

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (09:51 IST)
దేశంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కలకలం రేపుతోంది. తాజాగా ఏపీ, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కరోనా కలకలం రేపుతోంది. దేవస్థానంలో పనిచేసే 16 మంది ఉద్యోగులకు కోవిడ్ సోకింది. వివిధ శాఖలలో పని చేస్తు్న్న సిబ్బందికి కరోనా సోకింది. కోవిడ్ నిబంధనల మేరకు ఆలయాల్లో చర్యలు తీసుకున్న వైరస్ మహమ్మారి ఆగడం లేదు. దాంతో భక్తులు లేక దేవస్తానం వెలవెలబోతున్నాయి.
 
శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి రాహుకేతు పూజలు చేసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టు పక్కల ఉన్న కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు వస్తుంటారు. ఆలయంలో గత రెండు రోజుల నుంచి భక్తులు రాక తగ్గిందంటున్నారు ఆలయ అధికారులు.
 
మరోవైపు ప్రతి ఏడాది రాములోరి కళ్యాణాన్ని భద్రాచలం రామాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. రాములోరి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలం వస్తుంటారు. అయితే, గతేడాది కరోనా లాక్ డౌన్ కారణంగా భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం నిరాడంబరంగా నిర్వహించారు. 
 
భక్తులు లేకుండానే కళ్యాణం జరిగింది. ఇక ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో మరోసారి ఆలయాలు మూతపడ్డాయి. ఈరోజు జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిరాడంబరంగా భక్తులు లేకుండానే కోవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉదయం 10:30 గంటలకు రాములోరి కళ్యాణ మహోత్సవం ప్రారంభం కానున్నది. మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ కళ్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments