Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీక్ - నంద్యాలలో 12 మంది అరెస్టు

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (15:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభ రోజున తెలుగు పరీక్ష జరిగింది. అయితే, ఈ పరీక్ష ప్రారంభానికి ముందే తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్‌లలో హల్చల్ చేసింది. దీనికి సంబంధించి 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. లీకేజీ సూత్రధారి రాజేశ్‌తో సహా మొత్తం 12 మంది ఉన్నారు. 
 
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి హైస్కూల్‌ నుంచి ఈ ప్రశ్నపత్రం లీకైనట్టు గుర్తించారు. దీనిపై జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రశ్నపత్ర లీకైనట్టు వార్తలు రాగానే జిల్లా విద్యాశాఖాధికారి, పోలీసు అధికారులు వేగంగా విచారణ చేపట్టారన్నారు. 
 
పరీక్ష ప్రారంభమైన వెంటనే తన మొబైల్‌లో ప్రశ్నపత్రాన్ని ఫోటోలు తీసి, ఆ ఫోటోలను బయటవేచివున్న తెలుగు టీచర్లకు పంపించాడని తెలిపారు. ఈ కేసులో అరెస్టు అయినవారిలో నాగరాజు, నిలకంఠేశ్వర రెడ్డి, నాగరాజు, మధు, వెంకటేశ్వర్లు, దస్తగిరి, వనజాక్షి, దుర్గ, పోతునూరు, ఆర్యభట్టు, రంగనాయకులు ఉన్నారని తెలిపారు. 
 
ఇంత జరుగుతున్నా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహించిన చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్‌కు చెందిన నలుగురిని కూడా సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఇదిలావుంటే ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అరెస్టు చేసిన వారిని గురువారం కోర్టులో హాజరుపరిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments